విద్యానగర్, మార్చి 3: ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పకుండా పోలియో చుకలు వేయించాలని తల్లిదండ్రులకు కరీంనగర్ జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ సూచించారు. పోలి యో రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం కరీంనగర్లోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్)లో పల్స్ పోలి యో చుకల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ పమేలా సత్పతి, నగర మేయర్ సునీల్ రావు తో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడారు. పోలియో వ్యాధి ని రూపుమాపేందుకు అందరూ సహకరించాలని పేరొన్నారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, చిన్నారులు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నదని చెప్పారు. మూడు రోజులపాటు వైద్య సిబ్బంది పోలియో చుకలు వేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో సుజాత, డిప్యూటీ వైద్యాధికారి జువేరియా, డీఐవో సాజిదా, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, జిల్లా మాస్ మీడియా అధికారి రంగారెడ్డి, ఎంసీహెచ్ సీనియర్ ఫిజీషియన్ నవీన తదితరులు పాల్గొన్నారు.