Veenavanka | వీణవంక, ఫిబ్రవరి 19 : వీణవంక మండల కేంద్రంలో గురువారం మరాఠీ మహారాజ్ ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను వీణవంక శ్రీ ఛత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు గుర్రం రంజిత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాళలు వేసి, నివాళులు అర్పించారు. మరాఠీ మహారాజ్ ఛత్రపతి శివాజీ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకొని, కొనసాగించాలని వారన్నారు. అనంతరం వీణవంక ఎస్బీఐ బ్యాంక్ నుండి బస్టాండ్ కూడలి వరకు సుమారు 50 బైక్లతో ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ దాసారపు సరోజన రాజేంద్రప్రసాద్, ఛత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ సభ్యులు మోటం అజయ్, రెడ్డిరాజుల నవీన్, మోటం హరీష్, వైద్య సాయిరాం, మాజీ సర్పంచ్ చిన్నాల అయిలయ్య యాదవ్, శివాలయం కమిటీ చైర్మన్ రామిడి శ్రీనివాస్, బీజేపీ మండలాధ్యక్షుడు బత్తిని నరేష్ గౌడ్, వార్డు సభ్యులు, యువకులు, గ్రామపెద్దలు తదితరులు పాల్గొన్నారు.