పోయినేడు వరకు మండుటెండల్లోనూ మత్తళ్లు దుంకిన చెక్డ్యాంలు ఈ ఎండకాలంలో చుక్క నీరు లేక వెలవెలబోతున్నాయి. నిండా నీటితో కనిపించే వాగులు కళ చెదిరిపోయి దర్శనమిస్తున్నాయి. నిరుడు మల్లన్నసాగర్ నుంచి ఎగువమానేరులోకి నీటిని వదలగా, ఆ మత్తడి నుంచి వచ్చిన నీటితో మానేరుపై ఉన్న కట్కూరు చెక్డ్యాం పొంగి పొర్లింది.
దీంతో ఇరుపక్కల భూగర్భ జలాలు పెరగడంతో పాటు సాగుకు ఢోకా లేకుండా పోయింది. అయితే, ప్రస్తుతం సర్కారు పట్టించుకోకపోవడంతో ఎగువమానేరుకు నీళ్లు రాక ఇలా బోసిపోయింది. ఇదొక్కటే కాదు, మానేరు వాగుపై ఉన్న 12 చెక్డ్యాంలు కూడా వట్టిపోయాయి.
– రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ)