కమాన్చౌరస్తా, మే 14 : సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాల్లో అల్ఫోర్స్ సీబీఎస్ఈ పాఠశాల విద్యార్థులు హవా కొనసాగించారు. వంద శాతం ఉత్తీర్ణతతో అత్యుత్తమ ప్రతిభ సాధించినట్లు విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా, కరీంనగర్లోని వావిలాలపల్లిలో గల అల్ఫోర్స్ టైనిటాట్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విద్యార్థుల విజయోత్సవ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చకటి ప్రణాళిక, నిరంతర పర్యవేక్షణతో విద్యార్థులకు మంచి ఫలితాలు సాధ్యమయ్యాయన్నారు.
ఇందులో భాగంగా, 10వ తరగతి ఫలితాల్లో వీ శ్రేయాష్రెడ్డి, జే చైత్ర 500 మారులకు 493 మారులు సాధించి 98.6% తో అగ్రస్థానంలో నిలిచారన్నారు. అలాగే, ఏ అక్షయ 487, ఎం లక్ష్మి సంయుక్త 487, జీ సహస్ర, డీ రుత్విక్, జీ లాన్యశ్రీ 486, జే సరయు, టీ స్వరజ్ఞ 485, తదితరులు మంచి ఫలితాలు సాధించినట్లు చెప్పారు. 219 మంది విద్యార్థులకు 89 మంది విద్యార్థులు 90 శాతం పైగా మారులు సాధించారన్నారు. 12వ తరగతి ఫలితాల్లో ఎన్ హేమంత్ 483 మారులు సాధించి 96.6% తో అగ్రస్థానంలో నిలవగా, సుబోద్ దరి 476, సాయి మంజునాథ్రెడ్డి 476, జీ లహరి 476, వీ శ్రీముఖి 472 మార్కులు సాధించారని చెప్పారు. మొత్తం 12 మంది విద్యార్థులు 90 శాతం పైగా మారులు సాధించారని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
సీబీఎస్ఈ ప్రకటించిన ఫలితాల్లో 500 మార్కులకు 493 మార్కులు రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ క్రమంలో సీబీఎస్ఈ పదో తరగతిలో 98.6 శాతం మార్కులు రావడం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నా. ఇందులో ఉపాధ్యాయుల సహకారం మరువలేనిది. ఎప్పటికప్పుడు సెలబస్ను అప్డేట్ చేస్తూ, తగిన సలహాలు ఇస్తూ చదవడంతో ఎంతో సహకరించారు. అల్ఫోర్స్లో పదో తరగతి, 12వ తరగతితోపాటు ఐఐటీ, నీట్ తరగతుల్లో చాలా బాగా వివరిస్తున్నారు. హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లకుండా కరీంనగర్ జిల్లాలో జాతీయ స్థాయి పరీక్షలకు శిక్షణ ఇవ్వడం గొప్ప విషయం.
– వీ శ్రేయాష్రెడ్డి, 10వ తరగతి