కరీంనగర్: జిల్లాలోని చిగురుమామిడి మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. మండలంలోని చినముల్కనూరు వద్ద ఓ కారు ప్రమాదవశాత్తు బావిలో పడింది. గురువారం ఉయందం కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. బావిలో నీరుండటంతో అది పూర్తిగా మునిగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బావిలో నుంచి కారును వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గురైన కారులో ఎంతమంది ఉన్నారనే విషయం తెలియాల్సి ఉన్నది.