గోదావరిఖని, మే 6: పార్లమెంట్ ఎన్నికల పోరుకు మరో వారం గడువు మాత్రమే ఉండడంతో ప్రచారం జోరందుకున్నది. ఊరూరా హోరెత్తుతున్నది. అభ్యర్థులు, పార్టీ నేతలు వీధివీధినా తిరుగుతూ క్యాంపెయినింగ్ చేస్తుండగా, ఖనిలో సోమవారం బీఆర్ఎస్ పెద్దపల్లి అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ వినూత్నంగా ఓట్లు అభ్యర్థించారు.
ఆర్టీసీ బస్టాండ్ ఏరియాలో మాజీ ఎమ్మెల్యే చందర్తో కలిసి బ్యాటరీతో నడిచే రిక్షాలు నడిపారు. ముందుగా బీఆర్ఎస్ యువజన నాయకుడు తోట వేణు పార్టీ ప్రచారం కోసం పర్యావరణ హితంగా రూపొందించిన బ్యాటరీ రిక్షా, తోపుడు రిక్షాలను కొప్పుల జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వాహనాలను నడిపి శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.