సిరిసిల్ల/వీర్నపల్లి/ ఎల్లారెడ్డిపేట, మార్చి 9: సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లో శనివారం బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వర్స కృష్ణహరి ఆధ్వర్యంలో సాయిశివ గార్డెన్లో, వీర్నపల్లి రైతు వేదిక సమీపంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గుజ్జుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశాలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.
పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడి పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. కరీంనగర్ ఎంపీగా బోయినపల్లి వినోద్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. రామన్న ప్రసంగంతో పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొన్నది. కార్యక్రమంలో పార్లమెంట్ ఎన్నికల సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి తుల ఉమ, రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగరావు, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, జడ్పీటీసీలు చీటి లక్ష్మణ్రావు, గుగులోత్ కళావతి, ఎంపీపీలు పిల్లి రేణుక, మాలోత్ భూల, సెస్ డైరెక్టర్ మా డ్గుల మల్లేశం, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు చాంద్పాషా, బంజారా సంఘం రాష్ట్ర నాయకుడు గుగులోత్ సురేశ్నాయక్, మహిళా విభాగం మండలాధ్యక్షురాలు గుగులోత్ కళ,
యువజన విభాగం మండలాధ్యక్షుడు సామల్ల దేవరాజు, పీఏసీఎస్ చైర్మన్ గుండారపు కృష్ణారెడి,్డ ఎంపీటీసీ నాగరాణి, నాయకులు ఎడ్ల సాగర్, శ్రీరాంనాయక్, బోయిని రవి, భాస్కర్, అశో క్, సంతోష్, దినకర్, నాగరాజు, అజయ్, మల్లేశ్, అందె సుభాష్, కుంబాల మల్లారెడ్డి, శివకుమార్, మామిండ్ల తిరుపతి, బాల్రెడ్డి, అనసూయ, గీతాంజలి పాల్గొన్నారు.
అల్మాస్పూర్లో మల్లికార్జున స్వామి కల్యాణమహోత్సవానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. ఇక్కడ ఎంపీపీ పిల్లి రేణుక ఉన్నారు.
ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త భూక్యా శంకర్నాయక్కు ఇటీవల ఓపెన్ హార్ట్ సర్జరీ కాగా, ఆయనను కేటీఆర్ పరామర్శించారు. ఇబ్బందులేమున్నా తనకు తెలిపితే కాపాడుకుంటానని భరోసానిచ్చారు. ఇక్కడ ఎంపీటీసీ వరద బాబు, గణేశ్, రాజ్కుమార్ ఉన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తం డాల్లో ఎనలేని ప్రగతి జరిగిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జాన్సన్ రాథోడ్నాయక్ పేర్కొన్నారు. వీర్నపల్లి మండల కేంద్రంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ విజ్ఞప్తి మేరకు బంజారా (గోర్బోలీ) భాషలో ప్రసంగించారు. ఆయన మా టలు తెలుగులో గిరిజనులకు ఆరు నుంచి పది శాతం రిజర్వేషన్ను తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పెంచారన్నారు.
500జనాభా ఉన్న ప్రతి తండాలను గ్రామ పంచాయితీగా మార్చారని పేర్కొన్నారు. గిరిజనులకు పోడు పట్టాలు ఇవ్వడమే కాకుండా, సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించారని కొనియాడారు. అంబేద్కర్ ఓవర్సిస్ స్కాలర్షిప్తో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు విదేశీ విద్య అభ్యసించడానికి రూ.20లక్షల సాయం అందించిన ఘనత కేసీఆర్దేనన్నారు. పార్లమెంట్లో తెలంగాణ గొంతు వినిపించాలంటే రానున్న ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా వినోద్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
గంభీరావుపేట, మార్చి 9: గంభీరావుపేట బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాన్ని ఆదివారం మండల కేంద్రంలో మధ్యా హ్నం 3గంటలకు నిర్వహిస్తున్నామని మండలాధ్యక్షుడు పాపాగారి వెంకటస్వామిగౌడ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్, నాఫ్స్కాబ్ చైర్మ న్ కొండూరి రవీందర్రావు, జిల్లా అధ్యక్షుడు తోట ఆగ య్య హాజరవుతారని తెలిపారు. కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
గంభీరావుపేట, మార్చి 9: గజసింగవరం లో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు నివాసానికి శనివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వచ్చారు. ఈ సందర్భంగా రామన్నను రాజేశ్వర్రావునగర్కు చెందిన చల్ల లావణ్య-శ్రీనివాస్ దంపతులు కలిశారు. తమ ఇద్దరు కూతుళ్లు రోషిణి(13), అశ్విణి(11) మూగ చెవిటి సమస్యతో బాధపడుతున్నారని, వారికి వినికిడికి మిషన్లు సమకూర్చాలని కోరారు. దీంతో కేటీఆర్ స్పందించి, వెంటనే అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు రామన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.