ధర్మారం, మే6 : ధర్మపురి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్ది, ఇంటింటికీ సంక్షేమ ఫలాలను అందించిన బీఆర్ఎస్ పార్టీదే ముమ్మాటికి విజయమని, ధర్మపురిలో ఎగిరేది గులాబీ జెండాయేనని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, ది వ్యాంగ, వృద్ధుల సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ ధీమా వ్యక్తం చేశారు. ధర్మారం మండలం బొట్లవనపర్తిలో శనివారం ముఖ్య నేతలు, కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. రాబోయే అసెంబీ ఎన్నికలకు కార్యకర్తలు కార్మోన్ముఖులు కావాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ సర్కారు తిరిగి ఏర్పడేందుకు రాత్రింబవళ్లు కష్టపడి పనిచేయాలని నిర్దేశించారు. తిరిగి గెలిస్తేనే ప్రజల్లో పలుకుబడి, ఆదరణ ఉంటుందని చెప్పా రు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కారును పోలిన ట్రక్కు గుర్తు ఉండడం వల్లే మెజార్టీ తగ్గిందన్నారు.
తాను నిజాయతీగా కష్టపడి గెలిచానని పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందునా కార్యకర్తలు సర్కారు చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడపగడపకూ వెళ్లి వివరించాలని సూచించారు. నియోజవర్గాన్ని అభివృద్ధి చేసిన బీఆర్ఎస్కే ఓటడిగే హక్కు ఉందని తేల్చిచెప్పారు. కుల సంఘ భవనాల నిర్మాణానికి రూ. 6కోట్లు కేటాయించామని తెలిపారు. కష్టపడ్డ వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. నేతలు చిన్నచిన్న విబేధాలను పక్కనబెట్టి గ్రామాల్లో పక్కన పెట్టి పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. ప్రతిపక్షాల విష ప్రచారాన్ని ప్రజల్లో ఎండగట్టాలని ఉద్బోధించారు. గ్రామాల్లో పార్టీ పరిస్థితిని అంచనావేసి లో పాలు ఉంటే సరిదిద్దుకోవాలని సూచించారు. కష్టపడి పనిచేస్తే భారీ మెజార్టీ తధ్యమని పేర్కొన్నారు. కాగా, పార్టీ విజయానికి రాత్రింబవళ్లు ప నిచేస్తామని సర్పంచులు, ఎంపీటీసీలు మంత్రికి హా మీ ఇచ్చారు.
ధర్మారం బీఆర్ఎస్ మండలాధ్యక్షు డు రాచూరి శ్రీధర్ అధ్యక్షతన నిర్వహించిన స మావేశంలో ధర్మారం, పాలకుర్తి ఎంపీపీలు ము త్యాల కరుణశ్రీ, వ్యాళ్ల అనసూయ, ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ బుచ్చిరెడ్డి, బొట్లవనపర్తి, ఖిలావనపర్తి సర్పంచులు సాగంటి తారాకొండయ్య, రెడ్డపాక ప్రమీలా శ్రీనివాస్, ఎంపీటీసీ మోతె సుజాతా కనుకయ్య, ఉప స ర్పంచ్ కీసర స్వరూపారాణి, వైస్ చైర్మన్ చొప్పరి చంద్రయ్య, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ పా కాల రాజయ్య, జిల్లా సభ్యులు పూస్కూరు రామారావు, ఎగ్గెల స్వామి, మండల కోఆప్షన్ సభ్యుడు రఫీ, ఏఎంసీ మాజీ చైర్మన్ మోహన్రెడ్డి ఉన్నా రూ. 5 లక్షల పరిహారం చెక్కు అందజేత ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లికి చెందిన చందుపట్ల వెంకటేశ్ 2022 సెప్టెంబర్7న ఇంటి లో విద్యుత్షాక్తో మరణించాడు. దీంతో మంత్రి సిఫారసు మేరకు ఎన్పీడీఎసీఎల్ ద్వారా 5 ల క్షల ఎక్స్గ్రేషియా మంజూరైంది. అందుకు సం బంధించిన చెక్కును శనివారం మండల పరిషత్ కార్యాలయంలో మృతుడి భార్య మౌనికకు మం త్రి కొప్పుల ఈశ్వర్ అందజేశారు. ఇక్కడ ఎంపీడీవో బీ జయశీల, ట్రాన్స్కో ఏఈ ఖాసీం, మాజీ ఎంపీటీసీ గాగిరెడ్డి తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.