వేములవాడ, ఏప్రిల్ 28 : తెలంగాణ పుట్టుకను అవమానించిన ప్రధాని నరేంద్ర మోదీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు ఎందుకు వేయాలి? అని బీఆర్ఎస్ వ రింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఆదివారం వేములవాడ పట్టణంలోని మహారాజ ఫంక్షన్ హాల్లో వేములవాడ నియోజకవర్గ బూత్ కమిటీల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్న గడువు వచ్చే జూన్ మాసంలో అయిపోతున్నదని, ఎవరైనా హైదరాబాద్ను కేంద్రప్రాంతపాలితంగా ప్రకటిద్దామని ఆలోచన చేస్తే దానిని అడ్డుకునే శక్తి ఒక గులాబీ పార్టీకే ఉందని స్పష్టం చేశారు.
ఇక దేశంలో 400 సీట్లు గెలిపిస్తే అంబేదర్ రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేసి రిజర్వేషన్లు కూడా ఎత్తివేస్తామని బీజేపీ నాయకులు ప్రగల్భాలు పలుకుతున్నారని, ఇలాంటి వాటిని అడ్డుకునే శక్తి కూడా మనకే ఉందని చెప్పారు. ఈ ప్రాంత ప్రజల కష్టసుఖాలు తెలిసిన నాయకుడు వినోద్కుమార్ పార్లమెంట్లో ఉంటే మన సమస్యలు పరిషారం అవుతాయన్నా రు. ఇక 100 రోజుల్లో చోటే భాయ్, 2014 నుంచి బడే భాయ్ ఇద్దరూ ప్రజలను మోసం చేశారని తెలిపారు. 2022 కల్లా రైతుల ఆదాయం డబుల్ చేస్తానని చెప్పి క ష్టాలను మాత్రం డబుల్ చేసిందని బీజేపీ సరారును దుయ్యపడ్డారు. రెండుకోట్ల ఉద్యోగాలు ఇస్తామని, బు ల్లెట్ రైలు తెస్తామని చెప్పిన నాయకుడు మోదీ మన కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్ కూడా పూర్తి చేయలేకపోయారని తెలిపారు.
ఐదు ట్రిలియన్ డాలర్ల స్థాయికి దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేస్తానని చెప్పిన నాయకుడి తీరుతో రూపాయి పాతాళంలోకి వెళ్లగా అప్పులు ఆకాశాన్ని అంటాయని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర విభజనలో ఇచ్చిన వాటిని ఏమి కూడా మోదీ సరారు అమ లు చేయలేదన్నారు. హైదరాబాద్కు ఉన్న ఐటీఐఆర్ని కూడా ఎత్తివేసిందని తెలిపారు. మోదీ పదేళ్ల పాలనలో ప్రజలకు తీరని ద్రోహం చేశారని తీవ్రంగా విమర్శించా రు. 2014లో రూ.400 ఉన్న సిలిండర్ రూ.1200 పెం చారని, ముడిచమురు బ్యారెల్ 100 డాలర్లు ఉండగా ప్రస్తుతం 86 డాలర్లకు తగ్గినా పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నించారు.
పెరిగిన ఇంధన ధరలతో అనేక వస్తువుల మీద భారంపడి సామాన్య ప్రజలపై కూడా పడిందన్నారు. జాతీయ రహదారుల మీద సెస్ పేరిట రూ.30 లక్షల కోట్లు వసూ లు చేసి ఇందులో సగం రూ.14లక్షల కోట్లు అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ రంగాల రుణ ఎగవేతదారులకు అందించాడని ఆరోపించారు. యువతలో మతవిధ్వేషాల విషం నింపి ఇదే పని అన్నట్లుగా తప్పుదోవ పట్టిస్తున్నాడని మండిపడ్డారు.
శ్రీరాముడు అందరివాడని, ఎమ్మెల్యే, ఎంపీ కాదని, మంచి పని చేసే వాళ్లకు మాత్రమే అధికారం ఇవ్వాలని ఆయన చెప్పాడని కేటీఆర్ గుర్తు చేశారు. ఐదేళ్లు ఎంపీగా ఉన్న బండి సంజయ్ దేశం కోసం.. ధర్మం కోసం అని మాట్లాడుతాడని, ఐదు పైసల పని కూడా చేయలేదని ఎద్దేవా చేశారు. వేములవాడ రాజన్న, కొండగట్టు అంజ న్న, ఇల్లందకుంట సీతారామస్వామి, సిరిసిల్ల మారండేయ ఆలయాలకు ఒక్క రూపాయి అయినా కేంద్రం నుంచి తెచ్చాడా? అని ప్రశ్నించారు. 2014 నుంచి 2019 వరకు వినోద్కుమార్ పనిచేశారని, 2019 నుంచి ఇప్పటి దాకా బండి సంజయ్ ఇదే బీజేపీ పరిపాలనలో ఎంపీగా ఉన్నారని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎవరెన్ని నిధులు తెచ్చారో చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు.
కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికలో కాంగ్రెస్, బీజేపీది మ్యాచ్ ఫిక్సింగ్ అని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిని తిప్పాపూర్ బస్టాండ్ వద్ద కండువా తీసి నిలబెడితే ఎవరూ గుర్తుపట్టరని, ఆ పార్టీ కార్యకర్తలు కూడా గుర్తుపట్టలేరని ఎద్దేవా చేశారు. నిజానికి కరీంనగర్లో జీవన్రెడ్డి లేదా ప్రవీణ్రెడ్డి వంటి నాయకులు పోటీ చేయాల్సి ఉండేదని, వీరిద్దరైతే గట్టిపోటీ ఇస్తారని సీఎం రేవంత్రెడ్డి, బండి సంజయ్ డమ్మీ క్యాండెట్ను ఎంపిక చేశారన్నారు.
సీఎం రేవంత్రెడ్డివి చిల్లర మాటలు.. ఉద్దెర పనులని కేటీఆర్ విమర్శించారు. లంకె బిందెలు దొరుకుతాయని వచ్చానని మాట్లాడడమే కాకుండా జేబులో కత్తెరలు పెట్టుకొని తిరుగుతున్నానని చెప్పడం చిల్లర మాటలలాగే ఉన్నాయన్నారు. ఇక సంక్షేమ పథకాల్లో అన్నీ ఉద్దెర ఖాతాలేనని విమర్శించారు.
ఆది సీనన్న తులం బంగారం ఇప్పించు నిరుపేద యువతి వివాహానికి బంగారం కూడా ఇస్తామని ఎన్నికల్లో మాయమాటల హామీలు ఇచ్చారని కేటీఆర్ గుర్తు చేశారు. వేములవాడలో బంగారం దుకాణాలు లేవా? ఆది శ్రీనన్నకు చెప్పి ఇప్పించాలని ఆయన కార్యకర్తలకు సూచించారు.
70 ఏళ్ల వయసులో తొంటి ఎముక విరిగిన పార్టీ అధినేత కేసీఆర్ బస్సు యాత్రతో ప్రజల వద్దకు వచ్చి ప్రచారం చేస్తూ కష్టపడుతున్నారని కేటీఆర్ తెలిపారు. 12 బీఆర్ఎస్ సీట్లు గెలిపిస్తే రాష్ట్ర రాజకీయాలను శాసించే రోజు ఏడాదిలోపే వస్తుందని కార్యకర్తలకు ధైర్యాన్ని నింపారు. ప్రతిరోజూ ఉదయం ఒక గంట సాయంత్రం రెండు గంటలు బూత్ కమిటీలో పనిచేసి రాష్ట్ర ప్రభుత్వ పథకాల వైఫల్యాలు, కేంద్రంలోని మోదీ ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ ఓట్లు అడగాలని సూచించారు. గ్రామాల్లో పంచాయతీలు పకన పెట్టి తల్లి లాంటి పార్టీకి కష్టం వచ్చినప్పుడు అందరూ అండగా నిలిచి కాపాడుకుందామని పిలుపునిచ్చారు.
గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొని లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిద్దాం. కరీంనగర్ ఎంపీగా బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ను గెలిపించుకుందాం. రాహుల్గాంధీని ముఖ్యమంత్రి చేసుకుందాం.. అంటూ ఇటీవల సోషల్మీడియా వేదికగా వైరల్ అయిన ఒక వీడియో చూస్తే ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఎంత పరిజ్ఞానం ఉందో అర్థమవుతుంది. మన సమస్యలు తెలిసిన నాయకుడిగా వినోద్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించుకుని పార్లమెంట్కు పంపుదాం.
– చల్మెడ లక్ష్మీనరసింహారావు, బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి
గ్రామస్థాయి నుంచి మొదలుకొని పట్టణాల వరకు బీఆర్ఎస్ పార్టీకి ఉన్న క్యాడర్ జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్కు లేదు. కేవలం 1.8శాతం ఓట్లతో మాత్రమే మనం అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పో యాం. కానీ మ నం కోల్పోయింది అధికారం కాదు.. ప్రజా సేవ చేసే అవకాశాన్ని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ర్టానికి గులాబీ జెండా అవసరం. ఓట్ల కోసం గోదావరి జలాలను తమిళనాడుకు తరలించే కుట్ర జరుగుతున్నది. దీనిని అడ్డుకునే శక్తి గులాబీ పార్టీకి మాత్రమే ఉన్నది. ఆ రోజుల్లో ఐదుగురు ఎంపీలుగా గెలిస్తే చంద్రబాబు, రాజశేఖర్రెడ్డి అవహేళన చేసిన్రు. స్వ రాష్ట్ర సాధనలో ఐదుగురు ఎంపీలుగా ఉన్న తాము, 32 రాజకీయ పార్టీల దగ్గరకు వెళ్లి తెలంగాణను సాధించుకున్నది.
– బోయినపల్లి వినోద్కుమార్, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి
బూత్ కమిటీల వా రీగా ప్రతి కార్యక ర్తా కష్టపడి పని చేస్తే లోక్సభ ఎన్నికల్లో విజయం మ నదే.. పార్టీ శ్రేణులంతా ఇంటింటికీ వెళ్లి బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించాలి. వినోద్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించేలా సమష్టి విస్తృత ప్రచారం చేయాలి.
– తోట ఆగయ్య, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు