పెద్దపల్లి కమాన్, జూలై 26 : రైతుల సమస్యల పరిష్కారం బీఆర్ఎస్ మరోసారి పోరుబాట పడుతున్నది. సోమవారం పెద్దపల్లి జిల్లాలో ‘చలో కలెక్టరేట్’ చేపట్టింది. ప్రస్తుతం ఎల్నినో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కన్నెపల్లి పంపుహౌస్ మోటర్లను వెంటనే ఆన్ చేసి రైతులకు సాగునీరు ఇవ్వాలని, లో వోల్టేజీ, కోతలు లేకుండా 24 గంటల కరెంట్ సరఫరా చేయాలని, రైతులకు సరిపడా యూరియా, ఎరువులను అందించాలని డిమాండ్ చేస్తూ ఉదయం 10 గంటలకు పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపడుతన్నట్టు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి తెలిపారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేస్తామని చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.