చిగురుమామిడి, ఫిబ్రవరి 6: పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికుల్లా పని చేయాలని పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మామిడి అంజయ్య అధ్యక్షతన మంగళవారం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన వొడితల సతీశ్ కుమార్ మాట్లాడుతూ, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే సీఎం రేవంత్రెడ్డి రాజీనామా చేస్తారా అని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఇప్పటికే కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో విరక్తి వచ్చిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. సమావేశంలో ఎంపీపీ కొత్త వినీత, వైస్ ఎంపీపీ బేతి రాజిరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మామిడి అంజయ్య, సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకటరమణారెడ్డి, వైస్ చైర్మన్ కరివేద మహేందర్ రెడ్డి, జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, సాంబారి కొమురయ్య, మండల ప్రధాన కార్యదర్శి మంకు శ్రీనివాస్ రెడ్డి, మండల మాజీ అధ్యక్షుడు రామోజు కృష్ణమాచారి, మాజీ ఎంపీపీ అందె సుజాత, ఆకవరం భవాని, ఎంపీటీసీలు మల్లేశం, స్వప్న, జమున, నాయకులు శివప్రసాద్, లక్ష్మీనారాయణ, సర్వర్ పాషా, వెంకటేశం, నర్సింహారెడ్డి, శ్రీనివాస్, ప్రవీణ్, రమేశ్, ఎస్కే సిరాజ్, లక్ష్మణ్, సంపత్, వేణు, రాజేందర్రెడ్డి, వెంకట్రెడ్డి, పోచయ్య, మహేందర్ రెడ్డి, తిరుపతి, సదానందం పాల్గొన్నారు.