ఇల్లంతకుంట, అక్టోబర్ 24: బీఆర్ఎస్ ప్రభు త్వ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటె యాలని మానకొండూర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ కోరారు. మంగళవారం ఆయన మండల కేంద్రానికి రాగా, జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, ఎంపీటీసీ ఒగ్గు నర్సయ్య దసరా శుభాకాంక్షలు తెలిపారు. అనం తరం జంగంరెడ్డిపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వ హించగా, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రసమయి మాట్లాడుతూ, కాంగ్రెస్ నాయకులు ఆచరణ సాధ్యం కాని పథకాలను ప్రచారం చేస్తూ, ప్రజలను మోసంచేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ మోసాలతో కూడుకున్న పార్టీ అని.. అభివృద్ధి అంటే బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. గ్రామాలను అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీని మరోసారి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్కు అవకాశం ఇస్తే రాష్ట్రం మరోసారి అంధకారంలోకి వెళ్తుందన్నారు. కాంగ్రెస్కు ఓటేసిన పాపానికి కర్ణాటక ప్రజలు ఆరు నెలలు గడవకముందే ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలకు అండగా ఉందని గుర్తు చేశారు. అనంతరం కాంగ్రెస్, బీజేపీ నుంచి పలువురు బీఆర్ఎస్లో చేరగా, ఎమ్మెల్యే కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణుతో పాటు ఏఎంసీ చైర్మన్ మామిడి సంజీవ్, పీఏసీఎస్ చైర్మన్ అన్నాడి అనంతరెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ ఎండ్ర చందన్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు చల్ల నారాయణ, సర్పంచ్ తూంకుంట శ్రీలత, ఎంపీటీసీ ఒగ్గు నర్సయ్య, నేతలు శ్రీనివాస్, రాజశేఖర్గౌడ్, నరేందర్రెడ్డి, బాలరాజు, బాబు, బాల్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.