చొప్పదండి, ఏప్రిల్ 28: చొప్పదండి పట్టణంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్కు మద్దతుగా ఆదివారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన రోడ్షో సక్సెస్ అయింది. ఈ సందర్భంగా చొప్పదండి పట్టణంతోపాటు చుట్టు పక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రోడ్షోలో కేటీఆర్ ప్రసంగాన్ని ఆసక్తిగా వింటూ కనిపించారు. కార్యక్రమంలో బోయినపల్లి వినోద్కుమార్తోపాటు మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, ఎంపీపీ చిలుక రవీందర్,
జడ్పీటీసీ మాచర్ల సౌజన్య-వినయ్, బీఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి భూపతిరెడ్డి, రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వర్రావు, సింగిల్ విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, మినుపాల తిరుపతిరావు, మారెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్ గౌడ్, గడ్డం చుకారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ చీకట్ల రాజశేఖర్, కౌన్సిలర్ కొత్తూరు మహేశ్, మాడూరి శ్రీనివాస్, వడ్లూరి గంగరాజు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్ రెడ్డి, పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్రెడ్డి, నాయకులు మాచర్ల వినయ్, డాక్టర్ అమిత్, నలుమాచు రామకృష్ణ, గన్ను శ్రీనివాస్ రెడ్డి, మహేశుని మల్లేశం, దండె కృష్ణ, సీపెల్లి గంగయ్య, కొత్తూరు నరేశ్, చీకట్ల లచ్చయ్య, రావణ్ తదితరులు పాల్గొన్నారు.
అంతకుముందు కరీంనగర్, మానకొండూర్ నియోజకవర్గాల్లో బూత్ స్థాయి కార్యకర్తల సమావేశాలకు ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్తో కలిసి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. నగరంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో జరిగిన కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ భానుప్రసాద్, నగర మేయర్ యాదగిరి సునీల్రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, కొత్తపల్లి మున్సిపల్ ఛైర్మన్ రుద్రరాజు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ పొన్నం అనిల్, బీఆర్ఎస్ నాయకులు అక్బర్హుస్సేన్, లక్ష్మయ్య, వాల రమణారావు, శ్యాంసుందర్రెడ్డి, కార్పొరేటర్లు, నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.