కరీంనగర్ కార్పొరేషన్, మే 4: కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్కు జనం నీరాజనం పలుకుతున్నారు. ప్రచారంలో భాగంగా ఎక్కడికి వెళ్లినా బ్రహ్మరథం పడుతున్నారు. శనివారం రామడుగు మండలం గోపాల్రావుపేట, గంగాధర మండలం మధురానగర్లో రోడ్షోలు, కరీంనగర్ జిల్లాకేంద్రంలో భగత్నగర్లో కార్నర్మీటింగ్ నిర్వహించగా.. ప్రజలు అశేషంగా తరలివచ్చారు.
ఈ సందర్భంగా ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెస్ ఉత్త గ్యారెంటీలు.. బీజేపీ ఉద్దెర మాటలను నమ్మి మోసపోవద్దని పిలుపునిచ్చారు. తెలంగాణ పదిలంగా ఉండాలంటే.. మన గళం పార్లమెంట్లో వినపడాలంటే తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.