చిగురుమామిడి, నవంబర్ 18: ‘ తెలంగాణలో బీఆర్ఎస్తోనే సమగ్రాభివృద్ధి జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెసోళ్లు అభివృద్ధి చేయడానికి ఏమీ లేదు. ఎన్నికల వేళ కనిపించే కాంగ్రెసోళ్లను నమ్మవద్దు. అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్కు మరోసారి ఓటేయాలి’ అని హుస్నాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ ప్రజలను అభ్యర్థించారు. మండలంలోని ముదిమాణిక్యం, రామంచ, ములనూర్, పీచుపల్లిలో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పనిచేసే వారిని గెలిపించి ప్రగతికి బాటలు వేయాలని ఓటర్లను కోరారు. గ్రామా ల్లో వీధుల వెంట తిరుగుతూ మహిళలను, వృద్ధులను ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా సతీశ్కుమార్ మాట్లాడారు. పదేండ్లలో కరెంటు, నీటి కష్టాలు తీరాయన్నారు. బీఆర్ఎస్తోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమన్నారు.
ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని, మరోసారి బీఆర్ఎస్ను గెలిపిస్తే సీఎం కేసీఆర్ మరిన్నీ సంక్షేమ పథకాలు అమలు చేస్తారన్నారు. కాంగ్రెసోళ్లు 60 ఏండ్లల్లో తెలంగాణ ను ఆగం చేసి, ఇప్పుడు ఏం చేస్తారని ప్రశ్నించారు. ఆ పార్టీ నాయకులు చెప్పే మాయ మాటలు నమ్మి మోసపోవద్దని ఓటర్లను కోరారు. నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు. మండలంలో గోదావరి జలాల ద్వారా అనేక గ్రామాలకు సాగునీరు అందించి మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దిన ఘనత బీఆర్ఎస్దే అన్నారు. నేడు గోదావరి జలాలతో పంటలు పండించి రైతులు ఆనందంగా ఉంటున్నారని, వలసలు తగ్గాయన్నారు. పండిన పంటలను గ్రామంలోనే ప్రభుత్వం కొనుగోలు చేసి వారి ఖాతాలోనే డబ్బులు జమ చేస్తామని పేరొన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి, అభివృద్ధి చేస్తున్న బిఆర్ఎస్ను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా ఏకమవుతున్న శత్రువుల నాటకాలను రాబోయే 12 రోజుల్లో కారు గుర్తుకు ఓటు వేసి ముగింపు పలకాలని ఓటర్లను కోరారు. గ్రామాల్లో బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటా తిరిగి మ్యానిఫెస్టోను, ప్రభుత్వ పథకాలను బాధ్యతగా వివరించాలని కార్యకర్తలను కోరారు. ప్రచారంలో ఎంపీపీ కొత్త వినీత, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మామిడి అంజయ్య, మహిళా అధ్యక్షురాలు అందే సుజాత, సింగిల్ విండో చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి, ఆర్బీఎస్ మండల కో-ఆర్డినేటర్ పెనుకుల తిరుపతి, జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్రెడ్డి, సాంబారి కొమురయ్య, వైస్ ఎంపీపీ భేతి రాజిరెడ్డి,
సింగిల్ విండో వైస్ చైర్మన్ కరివేద మహేందర్రెడ్డి, సర్పంచులు జకుల రవి, గుంటి మాధవి, ముప్పిడి వెంకట నరసింహారెడ్డి, పీచు లీల, ఎంపీటీసీలు పెసరి జమున, మండల నాయకులు ముప్పిడి దేవేందర్రెడ్డి, ముప్పిడి జయప్రకాశ్రెడ్డి, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బోయిని రమేశ్, గిట్ల తిరుపతిరెడ్డి, బుర్ర తిరుపతి, యాల్ల జనార్దన్రెడ్డి, ఆర్బీఎస్ గ్రామ కో-ఆర్డినేటర్లు ముంజ వెంకన్న, సిద్ధంకి రాజమల్లు, నాయకులు చెప్యాల నారాయణరెడ్డి, వొంటెల కిషన్రెడ్డి, దాసరి సాంబయ్య, గుంటి తిరుపతి, పెసరి రాజేశం, ఎడవెల్లి భాసర్రెడ్డి, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
రామంచలో గ్రామ శాఖ అధ్యక్షుడు గిట్ల తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన 150 మంది ఎమ్మెల్యే సతీశ్కుమార్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు పేరొన్నారు. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడానికి, ఎమ్మెల్యే సతీశ్కుమార్ గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు.