సైదాపూర్, అక్టోబర్ 3: తనను మరోసారి హుస్నాబాద్ ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని బీఆర్ఎస్ అభ్యర్థి వొడితల సతీశ్కుమార్ విజ్ఞప్తి చేశారు. గతంలో రెండు సార్లు తనకు అవకాశమిస్తే హుస్నాబాద్ను ఎంతో అభివృద్ధి చేశానని చెప్పారు. ఈ సారి అవకాశమిస్తే మరింత ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ప్రజాసంక్షేమ పాలన అందిస్తున్న ప్రభుత్వానికే ప్రజలు పట్టం కట్టాలని కోరారు.
సైదాపూర్ మండలంలోని రాయికల్,రాయికల్తండా, నల్లానితండా, ఘనపూర్తండా, ఘనపూర్, ఆకునూర్, గొల్లగూడెం, పెర్కపల్లి, శివరాంపల్లి, సర్వాయిపేట గ్రామాల్లో శుక్రవారం ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయాగ్రామాల్లో డప్పుచప్పుళ్లు, నృత్యాలు, కోలాటాలతో ఘనం స్వాగతం పలికారు. ఈసందర్భంగా ఆయాచోట్ల సతీశ్కుమార్ మాట్లాడారు. గడిచిన తొమ్మిదన్నరేళ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించారు. సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల వారికి న్యాయం జరిగిందన్నారు. రైతుల కోసం 24గంటల కరెంట్, సాగునీరు, రైతుబందు, రైతుబీమాను అందిస్తున్నారని చెప్పారు.
ప్రజాసంక్షేమ పాలన చేసిన ప్రభుత్వానికే ప్రజలు పట్టం కడుతారనన్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్కు అండగా నిలువాలని కోరారు. మరోసారి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం తన పథకాల ద్వారా ప్రజలకు న్యాయం చేసిందన్నారు. కారుగుర్తుకు ఓటు వేసి సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలన్నారు.
సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి పట్టం కట్టాలన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ అభ్యర్థిగా వొడితల సతీస్కుమార్ను గెలిపించాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా అందరికీ న్యాయం చేస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ పేరాల గోపాలరావు, ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్రెడ్డి, బీఆర్ఎస్ మండల అద్యక్షుడు సోమారపు రాజయ్య, వైస్ ఎంపీపీ రావుల శ్రీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది. మన రాష్ట్రం ఇవాళ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్న బీఆర్ఎస్ సర్కారుకు మనమంతా మద్దుతునిద్దాం. కారుగుర్తుకు ఓటేసి సీఎం నాయకత్వాన్ని బలపరుద్దాం. వొడితల సతీశ్కుమార్ను మరోసారి భారీమెజార్టీతో గెలిపిద్దాం.
– ఇనుగాల పెద్దిరెడ్డి, హుస్నాబాద్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి