హుజూరాబాద్ టౌన్, ఫిబ్రవరి 14 : పొన్నం లాగా నక జిత్తులతో తాను గెలువలేదని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో సింహంలా గెలిచానని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి స్పష్టం చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తనను గెలిపించేందుకు తన భార్యాబిడ్డలు చేసిన ప్రచారం, వారితోపాటు హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల సహకారంతోనే విజయం సాధించానని చెప్పారు. తన కోసం, తన గెలుపు కోసం తన భార్యాబిడ్డలు ప్రచారం చేయడంలో తప్పేముందో? మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పాలని నిలదీశారు. 2018లో కరీంనగర్ అసెంబ్లీ తరఫున ఆయన పోటీ చేసినప్పుడు ఓడిపోవాలని ఆయన సతీమణి ఆత్మహత్యా యత్నం చేసింది అబద్ధమా? చెప్పాలని ప్రశ్నించారు.
హైదరాబాద్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో తనపై వ్యక్తిగత ఆరోపణలు చేశారని ధ్వజమెత్తారు. ఒకరిని అనే ముందు తనేంటో తాను తెలుసుకోవాలని హితవు పలికారు. ఒక వేలు ఎదుటి వారిని చూపిస్తే మిగతా నాలుగు వేళ్లు తిరిగి మనలనే చూపిస్తాయనే విషయాన్ని మరిచిపోవద్దని సూచించారు. దమ్ము, ధైర్యమున్న నాయకుడివైతే కరీంనగర్లో పోటీ ఎందుకు చేయలేదో చెప్పాలని నిలదీశారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రవీణ్రెడ్డికి కేటాయించే సీటును పొన్నం నకలా పొంది, గెలిచాడని ఎద్దేవా చేశారు.
సొంత నియోజకవర్గంలో గెలువలేడనే భయంతోనే పక నియోజకవర్గానికి వెళ్లాడని ఎద్దేవా చేశారు. 2018లో కరీంనగర్ నుంచి పోటీ చేసినప్పుడు కేవలం 38 వేల ఓట్లు మాత్రమే పొన్నంకు వచ్చాయని, పార్లమెంట్ ఎన్నికల్లో సైతం పోటీ చేస్తే సొంత నియోజకవర్గంలోని ఆయన సొంత వాడలో 19 ఓట్లు మాత్రమే వచ్చాయని గుర్తు చేశారు. పొన్నం ఇతరులపై మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. కేసీఆర్ ఆశీర్వాదంతో హుజూరాబాద్ ప్రజల ఆశీస్సులతో గెలిచిన చరిత్ర తనదని చెప్పారు. హుజూరాబాద్లో ఈటల రాజేందర్ను ఓడించి తెలంగాణ ప్రజలతోపాటు దేశ ప్రజలు హుజూరాబాద్ వైపు చూసేలా చేశానన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్రెడ్డి పాల్గొన్నారు.