హుజూరాబాద్, నవంబర్ 29: ఎన్నికల్లో ఒకే ఒక్క అవకాశమివ్వండి… అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, గత నాయకులు తమ స్వలాభపేక్షకోసం పాటుపడ్డారని, తాను అలాంటి నాయకుడిని కాదన్నారు. తనకంటూ ఒక విజన్ ఉందని, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేసి నియోజకవర్గ అభివృద్ధికి బాసటగా నిలవాలని విన్నవించారు. హుజూరాబాద్ ప్రజల చిరకాల వాంఛ అయినా మినీ కలెక్టరేట్, అలాగే పట్టణం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు, కార్పొరేట్ స్థాయిలో బాలికల హైసూల్ నిర్మాణం, పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్, ఫుట్పాత్లు నిర్మిస్తానని హామీ ఇచ్చారు. వీటితో పాటు మోడల్ చెరువును టూరిజం స్పాట్గా మార్చుతానని, డిపో క్రాస్ నుంచి ఇప్పల్ నర్సింగాపూర్ వరకు బీటీ రోడ్, డిపో క్రాస్ నుంచి పరకాల క్రాస్ రోడ్ వరకు, హుజూరాబాద్ మారెట్ నుంచి తుమ్మనపల్లి వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తానని తెలిపారు.
హుజూరాబాద్ బస్టాండ్ను రీడిజైన్ చేసి అద్భుతంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. జమ్మికుంట పట్టణాన్ని బిజినెస్ కేంద్రంగా డిక్లరేషన్ చేస్తామని, నాయిని చెరువును టూరిజం హబ్ మారుస్తామని, 100 పడకల దవాఖాన, అండర్ గ్రౌండ్ బ్రిడ్జి, స్పోర్ట్స్ స్టేడియం (మినీ స్టేడియం) నిర్మిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. వావిలాల గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేస్తామని, ఇంటిగ్రేటెడ్ మారెట్, అద్భుతమైన పోలీస్ స్టేషన్ నిర్మిస్తామని, అంబేదర్, హౌసింగ్ బోర్డు కాలనీల్లో డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిషారం చూపుతామని తెలిపారు. కమలాపూర్ గ్రామపంచాయతీని మున్సిపాలిటీగా మార్చడం, చేపల మారెట్ ఏర్పాటు, ఉప్పల్, శనిగరాన్ని నూతన మండలాలుగా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. కమలాపూర్ చెరువును టూరిజం హబ్గా మార్పు, మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు, బస్టాండ్ కాంప్లెక్స్ నిర్మాణం, శనిగరంలోని డీబీఎం-24, పంగిడిపల్లి డీబీఎం-20, 61 పునరుద్ధరణ చేసి కాలువ ఎత్తు పెంచుతానని పేర్కొన్నారు.
వీణవంక మండలంలో చల్లూర్ గ్రామాన్ని నూతన మండలంగా ఏర్పాటు చేస్తానని, మినీ ఎల్ఎండీగా కల్వల ప్రాజెక్ట్ను మారుస్తామని, ఎంజేపీ గురుకులానికి నూతన భవనాన్ని నిర్మిస్తామని, పోలీస్ స్టేషన్ను అద్భుతంగా తీర్చిదిద్దుతామని, బతుకమ్మ ఘాట్ నిర్మాణం చేస్తానని వెల్లడించారు. ఇల్లందకుంటను టెంపుల్ సిటీ (మినీ యాదాద్రి)గా మారుస్తామని, తహసీల్దార్ కార్యాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని, పోలీస్ స్టేషన్, మండల పరిషత్ కార్యాలయాలకు నూతన భవనాలు నిర్మిస్తామని, టెంపుల్ గెస్ట్ హౌస్, టూరిజం స్పాట్గా రిజర్వాయర్ నిర్మాణం చేస్తానని పేర్కొన్నారు. ఇవేకాకుండా నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మిగిలిన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర అభివృద్ధి పనులు పూర్తి చేస్తానని తెలిపారు. అలాగే అన్ని సంఘాల కమ్యూనిటీ భవనాలు, దేవాలయాలు, చర్చిలను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సీపీ
రాంనగర్, నవంబర్ 29:ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా బుధవారం కరీంనగర్ కమిషనరేట్లోని పలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి పరిశీలించారు. ఇందులో భాగంగా మానకొండూర్లోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను స్వయంగా పరిశీలించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద స్థానిక పోలీసులతో పాటు కేంద్ర సాయుధ బలగాలను విధుల్లో ఉంచామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న సిబ్బందికి నిర్వహించాల్సిన విధుల పట్ల పలు సూచనలు చేశారు. పోలింగ్ రోజున ఏదైనా శాంతి భద్రతల సమస్యలు తలెత్తితే వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు తెలియజేయాలన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించి విధులు నిర్వర్తించాలన్నారు.