నాడు ఊరూరా పంచాయతీ భవనాలు అరకొర వసతులతో, అధ్వానంగా ఉండేవి. ఎప్పుడో నిర్మించినవి కావడంతో గోడలు పగుళ్లు చూపి, పై కప్పు పెచ్చులూడుతూ పాలకవర్గ సభ్యులు, సిబ్బందిని నిత్యం నరకం చూపించేవి. అసలు కొన్ని గ్రామాలకు సొంత భవనాలు అద్దె ప్రాతిపదికన నడిచేవి. నూతన పాలనా భవనాలు నిర్మించాలని వేడుకున్నా అప్పటి పాలకుల నుంచి కనీస స్పందన కరువయ్యేది.
కానీ స్వరాష్ట్రంలో దశాబ్దాల నాటి వ్యథ దూరమైంది.
పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు అన్న నినాదంతో అభివృద్ధికి బాటలు వేస్తున్న బీఆర్ఎస్ సర్కారు ప్రతి గ్రామానికి ఆధునిక పాలనా భవనం నిర్మించింది. ఆధునిక వసతులు, సకల సౌకర్యాలతో అందుబాటులోకి తెస్తుండడంతో పాలకవర్గం, ప్రజల్లో హర్షం వ్యక్తమవుతున్నది. ఇందుకు జూలపల్లి మండలం కుమ్మరికుంట పంచాయతీ భవనమే నిదర్శనంగా నిలుస్తున్నది. 25 లక్షలతో ఆధునికంగా నెలకొల్పిన భవనం నయా సౌధాన్ని తలపిస్తున్నది. సర్పంచ్, కార్యదర్శి, కారోబార్, పాలక వర్గం సభ్యుల సమావేశాలకు వేర్వేరు గదులతో ఎంతో సౌకర్యంగా ఉంది.
– జూలపల్లి, మే 6