రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణను సస్యశ్యామలం చేయాలని, దశాబ్దాల కరువును దూరం చేయాలని కాళేశ్వరం ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నాలుగు సజీవ జలధారలు సృష్టించామని, కానీ, కాంగ్రెస్ సర్కారు అసమర్థత పాలనలో అవి ఎడారులుగా మారాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. 2014కు ముందు ఉన్న పరిస్థితులే మళ్లీ పునరావృతమైతున్నాయని,. ఎక్కడ చూసినా కాలిపోయిన మోటర్లు, నీళ్ల ట్యాంకర్లు, ఎండిపోయిన పంటలు, నీళ్ల కోసం ప్రజలు ఎదురుచూస్తున్న దృశ్యాలు మళ్లీ కనిపిస్తున్నాయని ఆవేదన చెందారు. నీటి నిర్వహణ తెల్వని లత్కోర్లు, చవట దద్దమ్మలు రాజ్యమేలుతున్న కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని ఆగ్రహించారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, ప్రభుత్వం తెచ్చిన కరువేనని ధ్వజమెత్తారు.
కొన్ని రోజుల ముందే నీళ్లు వదిలి ఉంటే ప్రతి గ్రామంలో పంట మనకు దక్కేదన్నారు. సమయానికి నీళ్లు వదలక, కరెంటు ఇవ్వక, రైతుబంధు ఖాతాలో వేయక ప్రజలను ఇబ్బంది పెట్టడంతోనే ఈ దుస్థితి వచ్చిందని విమర్శించారు. మీ వెర్రివేషాల కారణంగా వ్యవసాయం సంక్షోభంలో చిక్కుకున్నదని, మిమ్మల్ని వేటాడి, వెంటాడి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేలా చేస్తామని హెచ్చరించారు.
పొలంబాటలో భాగంగా శుక్రవారం కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఎండిన పంటలను పరిశీలించిన కేసీఆర్, సాయంత్రం ఆరుగంటలకు సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. బోయినపల్లిలో రైతులు తెచ్చిన ఎండిపోయిన పంటల ఫొటోలను కేటీఆర్ తీసుకొచ్చి ఇవ్వగా.. వేదికపై ఆ చిత్రాలను చూపిస్తూ పరిస్థితిని వివరించారు. నాడు ఉద్యమంలో మేం ఏదైతే అనుకున్నమో.. మేం అధికారంలోకి రాగానే అవన్నీ పూర్తి చేశామని, ఈ క్రమంలోనే కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సాగు, తాగునీటికి ఢోకా లేకుండా చేశామని
ఎంతో కష్టపడి కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి నం. ఉమ్మడి జిల్లాకు ఏ ఢోకా లేకుండా నాలు గు సజీవ జలధారలను సృష్టించినం. అవి ని రంతరం ఈ జిల్లాను కాపాడినయి. వాటిని యావత్తు కరీంనగర్ జిల్లా ప్రజానీకం కండ్లారా చూసిన్రు. ఫలితాన్ని అనుభవించిన్రు. అందులో ఒకటి మానేరు వాగు. అప్పర్ మానే రు జలాశయం వద్ద మొదలై మధ్యమానేరు, దిగువ మానేరు మీదుగా జయశంకర్ భూపా లపల్లి జిల్లాలో గోదావరి మీద నిర్మిం చిన అ న్నారం (సరస్వతీ) బరాజ్ వద్ద కలిసే వరకు నది మొత్తాన్ని సజీవంగా మార్చినం.
చెక్డ్యాం లు కట్టి ఎడాది పొడవునా నీరుండేలా నిండు కుండలా తయారు చేసినం. మానేరు పరీవా హకంలో సాగు, తాగుకు ఢోకా లేకుండా చేసినం. ఇంకోటి వరదకాలువ. దశాబ్దాల తరబడి పెండింగ్లో ఉన్న వరద కాలువను కంప్లీట్ చేయడమే కాకుండా శ్రీరాంసాగర్ పునర్జీవ పథకం కింద ఆ వరదకాలువనే రిజర్వాయర్గా మార్చినం. ఒకటిన్నర టీఎంసీల నీళ్లు సంవత్స రం పొడవునా ఉండేలా మూడు పంప్హౌస్లు కట్టి, కాళేశ్వరం నీటిని ఎగువకు ఎత్తిపోసి సజీవధారగా మార్చినం. మూడోది కాకతీయ కాలువ. ఎస్సారెస్పీ నుంచి వచ్చే నీరు జిల్లా నలుమూలలా ఏడాదికి తొ మ్మిదిన్నర నెలల నుంచి పదిన్నర నెలల వరకు ప్రవహించేలా ఈ కెనాల్ను తయారు చేసినం.
నాలుగో సజీవధారగా గోదావరిని తీర్చిదిద్దినం. బరాజ్లు, అసంపూర్తిగా ఉన్న ఎల్లంపల్లి లాం టి ప్రాజెక్టును పూర్తి చేసినం. ఎస్సారెస్పీకి పున ర్జీవం తేవడం, ఏదైనా తక్కువపెడితే కాళేశ్వరం నుంచి నింపుకునేలా గోదావరి నది 200 కిలోమీటర్ల పొడవునా సజీవంగా మార్చినం. ఈ నాలుగు సజీవజలధారలు ఐదారేండ్లుగా ప్రజలకు అమృతధారలుగా నిలిచినయి. వాటి ఫలాలను అనుభవించిన్రు. లక్షల టన్నుల ధాన్యం పండించిన్రు. పుష్కలంగా ఎంత కావాలంటే, అంత నీటిని వాడుకున్న కరీంనగర్ జిల్లా నాలుగునెలల్లోనే కరువు కోరల్లో చిక్కుకుంది. సజీవధారలు ఎడారులుగా మారినయి.
గతంలో మిడ్మానేరు బ్రిడ్జి మీద నిల్చుని ఉంటే ఒక సముద్రం మధ్యన నిల్చున్న ఫీలింగ్ ఉండేది. కానీ, ఈ రోజు అది పూర్తిగా ఎండిపోయింది. ఆనాడు మునిగిపోయిన ఊర్లు కూడా తేలినయి. కాంగ్రెస్ వాళ్లు ఒక శ్మశానంలా, ఎడారిలా దాన్ని తయారు చేసిన్రు. లోయర్ మానేరు డ్యాం.. ఒకప్పుడు ఎంత అద్భుతంగా ఉండె. మే నెల తర్వాత కూడా సగం నిండే ఉండేది. కరీంనగర్, సిద్దిపేటతోపాటు చుట్టూ ఉన్న పట్టణాలకు ఎంత కావాలంటే అంత నీరు అందించిన రిజర్వాయర్ నేడు ఎడారిగా మారింది.
కరీంనగర్ నగర ప్రజలకు తాగు నీటి కటకట మొదలైంది. నేను ఈ రోజు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంట్లో భోజనం చేస్తుంటే, మేయర్, కార్పొరేటర్లు వచ్చి నగరానికి మంచినీళ్లు వస్తలేవని బాధపడ్డరు. ఆల్టర్నేటివ్ డేస్లో ఇస్తున్నరని, ఇంకా కొన్ని రోజులు గడిస్తే మూడు రోజులకొకసారి నీళ్లు వస్తయని వాపోయారు. ఎందుకీ పరిస్థితి వచ్చింది. ఈ సమస్యలన్నీ ఎందుకు వచ్చినయ్? కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఎడారికిగా ఎందుకు మారింది? పంటలు ఎందుకు ఎండిపోతున్నయి? మొన్నటిదాకా వచ్చిన నీళ్లు ఎటుపోయినయి? ఇదంతా ప్రభుత్వం అసమర్థ, అవివేక, చవట విధానాలు, అర్భకత్వం వల్ల ఈ దరిద్రం మన రాష్ర్టానికి వచ్చింది.