గంగాధర, నవంబర్ 1 : తెలంగాణ ప్రజలను కడుపులో పెట్టుకొని కాపాడుకునే కేసీఆర్ కావాలో..? అబద్ధపు హామీలతో సున్నం పెట్టే కాంగ్రెస్ కాంగ్రెస్, బీజేపీలో కావాలో..? ప్రజలారా మీరే ఆలోచించాలని చొప్పదండి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ను నమ్మి ఓటు వేస్తే కర్ణాటక రైతుల మాదిరిగా అరిగోస పడుతామని, అర్ధరాత్రి సమయంలో పొలం కాడికి పోవడానికి టార్చిలైట్లు కొనుక్కోవాల్సిన దుస్థితి వస్తుందన్నారు. రైతుబంధు వద్దని, మూడు గంటల కరెంట్ చాలని చెప్పే కాంగ్రెస్తో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే సీఎం కేసీఆర్ను మరచిపోవద్దని, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.
గంగాధర మండలంలోని తాడిజెర్రి, రంగరావుపల్లి, గోపాల్రావుపల్లి, మల్లాపూర్ గ్రామాల్లో బుధవారం బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ ప్రచారం చేశారు. ఆయాగ్రామాల్లో ర్యాలీ తీసి గ్రామస్తులను ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా మహిళలు, సర్పంచులు, గ్రామస్తులు ఎమ్మెల్యేను సన్మానించి ఘన స్వాగతం పలికారు. ఆయాచోట్ల సుంకె రవిశంకర్ మాట్లాడారు. కాంగ్రెస్ది కుర్చీలాట అని, బీజేపీది మత రాజకీయమని, బీఆర్ఎస్ది ప్రజా సంక్షేమమని పేర్కొన్నారు. 1800 కోట్లతో చొప్పదండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని, పల్లెలను మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు.
బీఆర్ఎస్ జోరుకు ప్రతిపక్షాలు బేజారవుతున్నాయని ఎద్దేవా చేశారు. ఐదు గ్యారెంటీలతో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయకుండా చేతులెత్తేసిందని విమర్శించారు. కాంగ్రెస్ నేత ఉత్తమ్కుమార్రెడ్డి రైతుబంధును బంద్ చేయాలని ఈసీకి లేఖ రాశాడని దుయ్యబట్టారు. ‘జన్ధన్ ఖాతా కోలో.. హమ్ ధన్ధన్ పంద్రా లాక్ దాలేంగే’ అన్న ప్రధాని మోదీ 15 పైసలు కూడా జమచేయలేదని ఎద్దేవా చేశారు. ఎంపీగా గెలిచిన బండి సంజయ్ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో వచ్చి అబద్ధపు ప్రచారాలు చేసే వారిని నమ్మి మోసపోవద్దని కోరారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ పుల్కం అనురాధానర్సయ్య, సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిర్మల్రావు, ఆర్బీఎస్ మండల కో-ఆర్డినేటర్ పుల్కం గంగన్న, వైస్ ఎంపీపీ కంకణాల రాజ్గోపాల్రెడ్డి, వైస్ చైర్మన్ వేముల భాస్కర్, పార్టీ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్రావు, సర్పంచులు రామిడి కనకమ్మ, పాశం స్వప్నకుమార్, రాసూరి మల్లేశం, ఆకుల శంకరయ్య, కంకణాల విజేందర్రెడ్డి, మడ్లపెల్లి గంగాధర్, వేముల దామోదర్, ఎంపీటీసీలు ద్యావ మధుసూదన్రెడ్డి, ఆకుల శ్రీనివాస్, నాయకులు ఆకుల మధుసూదన్, రామిడి సురేందర్, రేండ్ల శ్రీనివాస్, అలువాల తిరుపతి, తడిగొప్పుల రమేశ్, ఎండీ అబ్బాస్, బొల్లాడి శ్రీనివాస్రెడ్డి, నిమ్మనవేని ప్రభాకర్, ఇరుగురాల రవి, గంగాధర శ్రీకాంత్, మ్యాకల కరుణాకర్, గుంటుకు ఆంజనేయులు, శనిగరపు వెంకటేశ్, అస్తపురం వెంకటేశ్, ఉప్పు ప్రశాంత్, రాసూరి సంజీవ్, కోల అనిల్, నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.