Eligedu | ఎలిగేడు: తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సీట్ అధికారులు నోటీసులు జారీ చేసి విచారణ చేయడాన్ని నిరసిస్తూ ఎలిగేడు మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకు నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు బీఆర్ఎస్ శ్రేణులు ర్యాలీ తీశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ,రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అంబేద్కర్ విగ్రహం ముందు బీఆర్ఎస్ కార్యకర్తలు బైఠాయించారు.
ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు బైరెడ్డి రామ్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ఆయన అన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ నాయకులను పోలీస్ సిబ్బంది అడ్డుకున్నారు.