జమ్మికుంట, డిసెంబర్ 5: ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇద్దరూ పచ్చి అబద్ధాల
కోరులని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుళ్ల సాక్షిగా చిల్లర రాజకీయా లు చేస్తున్నారని
మండిపడ్డారు. ఇక్కడి అభివృద్ధి కోసం బీజేపీ ప్రభుత్వం నుంచి రూ.లక్ష తెచ్చిన ముఖాలేనా.. మీవీ..? అని
ప్రశ్నించారు. మున్సిపల్ పరిధిలోని దుబ్బ మల్లన్నస్వామి ఆలయం లో నిర్వహించిన పెద్దపట్నాలకు జడ్పీ
చైర్పర్సన్ కనుమల్ల విజయ, మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావుతో కలిసి కౌశిక్రెడ్డి హాజరై ప్రత్యేక
పూజలు చేశారు. అభివృద్ధి పనులను పరిశీలించా రు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత
సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు.
టీఆర్ఎస్ చేసిన అభివృద్ధిపై చర్చకు మేం సిద్ధమని, దమ్ముంటే చర్చకు రావాలని స వాల్ విసిరారు. దేవుడి
సాక్షిగా అబద్ధాలు చెప్పే నేతలకు ప్రజా క్షేత్రంలో శిక్షలు తప్పవని హెచ్చరించారు. అంతకుముందు ఆలయకమిటీ, ఒగ్గు పూజారుల ఆధ్వర్యంలో ఎమ్మెల్సీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఘనంగాసన్మానించారు.
‘అపర కొమురవెల్లి’గా తీర్చిదిద్దుతా..
పురాతనమైన దుబ్బ మల్లన్న ఆలయానికి ఎమ్మెల్యేగా, మంత్రిగా ఈటల ఒక్క పైసా కేటాయించలేదని
ఆరోపించారు. సీఎం కేసీఆర్ను మించిన భక్తుడు దేశంలో మరోకరు లేరని, యాదగిరిగుట్టను రూ.2వేల
కోట్లు వెచ్చించి గొప్పగా తీర్చిదిద్దారని గుర్తు చేశారు. అలాగే దుబ్బ మల్లన్న గుడి అభివృద్ధికి రూ.4కోట్లు
కేటాయించి, గొప్పగా అభివృద్ధి చేశామని చెప్పారు. టీఆర్ఎస్ అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలు
గమనిస్తున్నారని, ప్రజలంతా ప్రభుత్వం వైపే ఉన్నారని స్పష్టం చేశారు. రాబో యే రోజుల్లో దుబ్బ మల్లన్న
గుడిని అపర కొమురవెల్లిగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
కమ్యూనిటీ హాల్కు భూమిపూజ
మున్సిపల్ పరిధిలోని మారుతీనగర్ పంచము ఖ హనుమాన్ దేవాలయం వెనుక గల 5గుంటల భూమిని
ఒడ్డెర సంఘానికి ప్రభుత్వం కేటాయించింది. అంతేకాకుండా కమ్యూనిటీ హాల్ నిర్మా ణానికి రూ.20లక్షలు
ఇటీవల మంజూరు చేసిం ది. కాగా నిర్మాణ పనులకు పీఏసీఎస్ చైర్మన్ పొనగంటి సంపత్, మున్సిపల్
చైర్మన్ రాజేశ్వర్రావుతో కలిసి ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి భూమిపూజ చేశారు. ర్యక్రమాల్లో వైస్ చైర్పర్సన్
దేశికి స్వప్న-కోటి, కమిషనర్ కే సమ్మయ్య, పలువురు కౌన్సిలర్లు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.