సిరిసిల్ల టౌన్, నవంబర్ 19: బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనని.. బీఆర్ఎస్కు ఏ పార్టీతోనూ పొత్తు లేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర నేత చీటి నర్సింగరావు సమక్షంలో కాంగ్రెస్ జిల్లా మైనార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫయాజ్ ఆధ్వర్యంలో 300మంది, టీడీపీ మైనా ర్టీ సెల్ అధ్యక్షుడు సలీం ఆధ్వర్యంలో 50మంది, కాంగ్రెస్ పట్టణ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫర్వేజ్ ఆధ్వర్యంలో 30మంది, కాంగ్రెస్ మైనార్టీ నేత యూనస్ ఆధ్వర్యంలో 30మంది ఆదివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలుస్తుందని కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందన్నారు.
గత ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ మద్దతునిచ్చిందని ఆరోపించారు. లేకుంటే ఆదిలాబాద్, నిజామాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్ ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచేదన్నారు. పొన్నం ప్రభాకర్, మధుయాష్కీకి డిపాజిట్ రాలేదంటే.. దాని అంతరార్థం కాంగ్రెస్, బీజేపీకి మద్దతు ఇచ్చినట్లేనన్నారు. ఈ విషయమై ప్రజల్లో చర్చ పెట్టాలని సూచించారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్ఎస్యూ నుంచి ఆర్ఎస్ఎస్, కమ్యూనిస్టులు, బీజేపీ, కాంగ్రెస్ అన్ని పార్టీల వద్దకు వెళ్లి రాష్ర్టాన్ని సాధించుకున్నామన్నారు. నాడు చెప్పిన విధంగానే ఏ పార్టీతో పొత్తు లేకుండా 2014నుంచి బీఆర్ఎస్ సొం తంగా పోటీ చేస్తున్నదని తెలిపారు. సిరిసిల్లలో ముస్లింలంతా బీఆర్ఎస్కు ఇచ్చిన సంపూర్ణ మద్ద తు దేశమంతా తెలియాల్సిన అవసరం ఉందన్నా రు. స్వరాష్ట్రంలో ముస్లింల సంక్షేమానికి విశేష కృషి చేశామన్నారు. పేదింటి ఆడబిడ్డల వివాహానికి షాదీముబారక్ ద్వారా లక్షానూటపదహారు రూపాయలు ఇస్తున్నట్లు తెలిపారు.
ముస్లిం పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సిరిసిల్లలో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ ఏర్పా టు ద్వారా ఉపాధి అవకాశాలకు బాటలు వేస్తున్నారన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరు తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు. కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో.. అన్న నినాదంతో చేసిన ఉద్యమంలో పోలీసులు అరెస్ట్ చేసి జైళ్లో పెట్టిన సందర్భాలు అనేకమన్నారు. శ్రీకాంతాచారి వంటి యువకుడు పెట్రోల్ పోసుకొని చనిపోయాడన్నారు. ఇలా వందల మంది యువకులు చనిపోయారన్నారు. దీంతో భయపడిన కాంగ్రెస్ పార్టీ 2009లో తెలంగాణ ఇస్తున్నట్లు ప్రకటన చేసిందని, ఆంధ్రోళ్లు ఒత్తిడి చేస్తే ఇచ్చిన తెలంగాణ ప్రకటనను రద్దు చేసింది సోనియాగాంధీ అని తెలిపారు. ఈ విషయం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నేడు కాంగ్రెస్ వాళ్లు వచ్చి.. తెలంగాణ మేమిచ్చి నం అని చెబుతున్నారని.. కానీ మనం కొట్లాడి సాధించుకున్న విషయం వాళ్లకు చెప్పాలన్నారు.
తెలంగాణ ఇవ్వమంటే నాటి ముఖ్యమంత్రి రాష్ట్రం వస్తే కరెంటు కోతలు వస్తాయన్నారన్నా రు. కానీ నేడు రాష్ట్ర వ్యాప్తంగా 24గంటలు కరెం ట్ ఇవ్వడంతో వ్యవసాయం పండుగలా మారిందన్నారు. 60ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క ఎస్సారెస్పీ ప్రాజెక్టును మాత్రమే కట్టిందని విమర్శించారు. స్వరాష్ట్రంలో కేసీఆర్ గోదావరి నదిపై ఐదు ప్రాజెక్టులు నిర్మించారని తెలిపారు. తెలంగాణ నేడు అభివృద్ధి వైపు వెళ్తుందన్నారు. నాడు కాంగ్రెస్ పాలనలో కర్ఫ్యూలు లేని రోజులు లేవన్నారు. గులాబీ జెండా నాయకత్వంలో శాంతియుత వాతావరణంలో పాలన సాగుతుందన్నా రు. నేదురుమల్లి జనార్దన్రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి, చెన్నారెడ్డిని దింపడానికి హైదరాబాద్లో అల్లర్లు సృష్టించి 300మందిని చంపారని కాంగ్రెస్ నేతలే చెప్పారన్నారు.
దేశంలో అల్లకల్లోలం సృష్టించింది కాంగ్రెస్ పార్టీ అని, మతోన్మాదం సృష్టించింది బీజేపీ అని మండిపడ్డారు. హైదరాబాద్లోని సెక్రటేరియేట్లో అన్ని మతా ల దేవాలయాలను నిర్మించినట్లు తెలిపారు. ముస్లింలంతా ఏకమై బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, టీపీటీడీసీ చైర్మన్ గూ డూరి ప్రవీణ్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, మసీదు కమిటీ అధ్యక్షుడు సలీం, మాజీ అధ్యక్షులు యూసుఫ్, సత్తార్, మైనార్టీ నాయకులు సయ్యద్ సాధిక్, మహమూద్, సొహైల్, రఫియొద్దీన్, సయ్యద్ అక్రం, అంజద్, కౌన్సిలర్ సయ్యద్సీమాబేగం, మాజీ కౌన్సిలర్ సయ్యద్తస్లీం, తదితరులు పాల్గొన్నారు.