చొప్పదండి, నవంబర్ 8 : కాంగ్రెస్ నాయకులు చెబుతున్న మోసపూరిత వ్యాఖ్యలను నమ్మి ఓటు వేస్తే రాష్ట్రంలో కరెంటు కోతలు తప్పవని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ హెచ్చరించారు. తెలంగాణ వస్తే కరెంటు సమస్య ఉంటుందని ఆనాడు కాంగ్రెస్ నాయకులు ఎద్దేవా చేశారని గుర్తు చేశారు. కానీ నేడు 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని స్పష్టం చేశారు. పదేళ్లలోనే తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశానికే ఆదర్శంగా నిలిపామని, ఆ ఘనత సీఎం కేసీఆర్కే దకుతుందని కొనియాడారు. బుధవారం చొప్పదండి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ నామినేషన్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా చొప్పదండి పట్ణణంలోని తెలంగాణ చౌరస్తా వద్ద నిర్వహించిన ప్రచార సభలో మాట్లాడారు.
దేశంలోనే ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో 35 ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని, ఉమ్మడి జిల్లాకు నాలుగు మెడికల్ కాలేజీలను మంజూరు చేయించామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు మూడు గంటలే కరెంటు సరిపోతుందని అంటున్నారని, ప్రజలు గమనించాలని సూచించారు. కాంగ్రెస్ నాయకులు ప్రచారం కోసం వస్తే.. మీరు గతంలో ఏం చేశారు? ఇప్పుడు గెలిస్తే ఏం చేస్తరు? అని నిలదీయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలు నమ్మి మోసపోతే గోసపడతామని సూచించారు. చొప్పదండి నియోజకవర్గం అభివృద్ధి తన బాధ్యత అని, ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి సుంకె రవిశంకర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ గుర్రం నీరజ, వైస్ చైర్పర్సన్ ఇప్పనపల్లి విజయలక్ష్మి -సాంబయ్య, ఎంపీపీలు చిలుక రవీందర్, పర్లపెల్లి వేణు, శ్రీరాం మధుకర్, మేన్నేని స్వర్ణలత-రాజనర్సింగరావు, జడ్పీటీసీ మాచర్ల సౌజన్య- వినయ్, పునుగోటి ప్రశాంతి-కృష్ణారావు, సింగిల్ విండో చైర్మన్లు వెల్మ మల్లారెడ్డి, మినుపాల తిరుపతిరావు, మురళీకృష్ణారెడ్డి, దూలం బాలగౌడ్, మారెట్ కమిటీ చైర్మన్ గడ్డం చుకారెడ్డి, మామిడి తిరుపతి, ఎల్కపల్లి లచ్చయ్య, వైస్ చైర్మన్ చీకట్ల రాజశేఖర్, మాజీ ఎంపీపీ వల్లాల కృష్ణహరి, మాజీ మారెట్ కమిటీ చైర్మన్ ఆరెల్లి చంద్ర శేఖర్గౌడ్, మాజీ వైస్ చైర్మన్ కొత్త గంగారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్రెడ్డి గంట్ల జితేందర్రెడ్డి, నవీన్రావు, పట్టణ అధ్యక్షుడు లోక రాజేశ్వర్రెడ్డి పాల్గొన్నారు.