కాంగ్రెస్, బీజేపీలు బరితెగించాయి. నిత్యం ప్రజల్లో ఉండే ఎమ్మెల్యే రసమయి బాలకిషన్కు పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక.. ఈ రెండు పార్టీలు ఏకమై పథకం ప్రకారమే ఆయన వాహనంపై గూండాయిజానికి దిగాయి. మానకొండూర్ మండలంలో తొలిపొద్దు కార్యక్రమంలో పాల్గొని బెజ్జంకి మండలానికి వెళ్తుండగా ఆ పార్టీల నాయకులు, కార్యకర్తలు గన్నేరువరం మండలం గుండ్లపల్లి వద్ద దారి కాచి రాళ్లు, కర్రలతో దాడి చేశారు. వాహనంపైకి దూసుకొచ్చి వీరంగం సృష్టించారు. ఈ ఘటనను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తీవ్రంగా ఖండించారు. దాడికి నిరసనగా టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. దాడికి బాధ్యుడిగా భావిస్తున్న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణతోపాటు మరి కొందరిని పోలీసులు అరెస్టు చేసి ఎల్ఎండీ పోలీసు స్టేషన్కు తరలించారు. పథకం ప్రకారమే దాడి జరిగిందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సత్యనారాయణ స్పష్టం చేశారు.
కరీంనగర్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ)/ తిమ్మాపూర్రూరల్: కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు బరి తెగించారు. మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వాహనంపై ఆదివారం కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లిలో దాడికి దిగారు. రాళ్లు, కర్రలతో వీరంగం సృష్టించారు. ని త్యం ప్రజల్లో ఉండే రసమయికి పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకనే ఈ రెండు పార్టీలు ఏకమై పథకం ప్రకారమే దాడికి పాల్పడినట్లు స్పష్టమవుతోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తూ నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్న ఆయనపై ఈ రెండు పార్టీల నాయకులు ఉద్దేశ పూర్వకంగానే దాడులకు పాల్పడినట్లు టీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే ఇటు వైపుగా వస్తున్న విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు దారికాచి గుండాల్లా ప్రవర్తించి దాడులకు తెగబడినట్లు ఇక్కడి పరిస్థితిని బట్టి స్పష్టంగా తెలుస్తోంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం
పాలుచేస్తున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి..
గుండ్లపల్లి నుంచి ఇల్లంతకుంట మండలం వెంకట్రావుపల్లి వరకు డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కాంగ్రెస్, బీజేపీ తదితర ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఏర్పడిన అఖిలపక్షం గుండ్లపల్లి వద్ద రాజీవ్ రహదారిపై ఆందోళన చేస్తుండగా మానకొండూర్ మండలంలో తొలిపొద్దు కార్యక్రమం లో పాల్గొని బెజ్జంకి మండలంలో పలు గ్రామాల్లో పర్యటించేందుకు వెళ్తున్న ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వాహన శ్రేణి కనిపించింది. దీంతో రెచ్చి పోయిన కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఆయన వాహనాన్ని గుర్తించి అడ్డగించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మానకొండూర్ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ వీరితోపాటు పరుగులు తీస్తూ దాడికి య త్నించారు. వాహనంపై చేతులతో కొడుతూ కిందికి దిగమని కేకలు వేశారు. డ్రైవర్ కారు ఆపకుండా అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా కారు వెంట పరుగులు తీస్తూ కొందరు రాళ్లు, కర్రలు విసిరారు. అక్కడితో ఆగకుండా రోడ్డు పక్క పొదల్లో పొంచి ఉన్న మరి కొందరు తన కారుపై దాడికి దిగారని స్వయంగా ఎమ్మెల్యే రసమయి చెప్పారు.
ఎమ్మెల్యే వాహనంపై దాడికి యత్నించిన సమయంలో అక్కడ కొద్ది సేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకుని ధర్నా చేస్తున్న అఖిలపక్ష నాయకులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. సీపీ సత్యనారాయణ స్వయంగా వెళ్లి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రసమయిపై దాడి జరిగిన విషయాన్ని తెలుసుకున్న టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రాజీవ్ రహదారిపైకి చేరుకుని ఆందోళనకు దిగారు. పోలీసులు దాడికి కారకుడని భావిస్తున్న కవ్వంపల్లి సత్యనారాయణతోపాటు మరి కొందరిని అరెస్టు చేసి ఎల్ఎండీ ఠాణాకు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా అక్కడికి పెద్ద సం ఖ్యలో చేరుకున్నారు. ఎమ్మెల్యే రసమయి కూడా వచ్చారు. కవ్వంపల్లిని అప్పటికే ఎల్ఎండీ పోలీసు స్టేషన్కు చేర్చిన పోలీసులు స్టేషన్లోనికి ఎవరినీ అనుమతించకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పో లీసు స్టేషన్ ముందే రాజీవ్ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, టీఆర్ఎస్ జిల్లా అ ధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ఎల్ఎండీ పోలీసు స్టేషన్ వద్దకు చేరుకుని టీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు.
దాడిని ఖండించిన వినోద్కుమార్
ఎమ్మెల్యే రసమయిపై దాడిని రాష్ట్ర ప్రణాళికా సం ఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్షాలకు ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళనలు వ్యక్తం చేసే హక్కు ఉంటుందని, కానీ దాడులకు పాల్పడడం ఏంటని ప్రశ్నించారు. తాము తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం పార్టీలను ఎదుర్కొన్నామని, ఒక్కనాడు కూడా దాడికి పాల్పడిన సం దర్భం కూడా లేదని గుర్తు చేశారు. నిత్యం ప్రజల మధ్య ఉండి ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్న నాయకుడు రసమయి అని, ఆయన అంటే ఏమనుకుంటున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో లక్షల మందిని కదిలించిన గొప్ప కళాకారుడని తెలిపారు. ఆయన పదవుల కోసం పని చేసే ఫక్తు రాజకీయ నాయకుడు కాదన్నారు. గన్నేరువరం అభివృద్ధికి రసమయి. తాను ఎంతో కృషి చేశామన్నారు. రోడ్డు కోసం కొట్లాడుతున్న కాంగ్రెస్, బీజేపీ నాయకులకు ఆనాడు సోయి ఎటు పోయిందని ప్రశ్నించారు.
గుండ్లపల్లి నుంచి వెంకట్రావ్పల్లి దాకా బ్రహ్మాండమైన డబుల్ రోడ్డు ప్రణాళిక వేశామని, అది ప్రభుత్వం వద్ద ఉందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ర్టానికి నిధులు రాకుండా చేసిందని, దీనిపై బండి సంజ య్ ఒక్కసారైనా మాట్లాడాడా? అని ప్రశ్నించా రు. ప్రధాని వచ్చినప్పుడు కనీసం ఒక్క వినతిపత్రం అయినా ఇచ్చారా? అని నిలదీశారు. నిత్యం రద్దీగా ఉండే రాజీవ్హ్రదారిని ఆరు లైన్ల రహదారిగా మార్చాలని తాను ఎన్నోసార్లు పార్లమెంటులో ప్రసంగించానని గుర్తు చేశారు. పార్టీలు నిరసనలు ప్రజాస్వామికంగా చేసుకోవాలని హితువుపలికారు. ఇలాంటి దాడులు చేయడం శోచనీయం కాదన్నారు. రసమయి మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తాము దాడులు మొదలు పెడితే ఏ పార్టీ కూడా ఊళ్లలో తిరగదని హెచ్చరించారు. టీఆర్ఎస్ శ్రేణులు ఓపిక పట్టాలని వినోద్కుమార్ కోరారు.
కాంగ్రెస్, బీజేపీ కలిసే దాడి: రసమయి
ప్రజాదరణ కోల్పోయిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు రాజకీయంగా లబ్ధి పొందేందుకు డబుల్రోడ్డు సమస్యను ముందేసుకుని తనపై దాడికి దిగారని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మీద కుట్ర చేసి దాడికి పాల్పడినట్లు ఆయన స్పష్టం చేశారు. బెజ్జంకి మండలం బేగంపేటలో అభివృద్ధి కార్యక్రమాలకు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఒక్కడినే వెళ్తుంటే.. చెట్ల పొ దల్లో కూర్చొని కుట్రపూరితంగా కర్రలు, రాళ్లతో దాడికి దిగారన్నారు. కాంగ్రెస్ నేత కవ్వంపల్లి సత్యనారాయణ ప్రజాస్వామిక పద్ధతిలో ధర్నా చేసుకోవాలని, యువకులను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడం మంచిది కాదని హితువు పలికారు.
నిత్యం హైదరాబాద్లో ఉండి ఎప్పుడో ఒక రోజు వచ్చి వార్తల్లోకెక్కేందుకు తనను ఏదో ఒకటి అని వెళ్లే కవ్వంపల్లి..యువకుల జీవితాలను పణంగా పెట్టి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. గుండ్లపల్లి నుంచి వెంకట్రావుపల్లి వరకు రోడ్డు కోసం ఇప్పటికే సీఎం కేసీఆర్కు విన్నవించామని చెప్పారు. గతంలో మండలంలో పర్యటించిన ఎంపీ బండి సంజయ్ హామీ ఇచ్చిన రోడ్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఆయనను ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. తాము ఇది వరకే కోట్లాది రూపాయలతో రోడ్లు, మౌలిక వసతులు కల్పించామని, బండి సంజయ్ తన నియోజకవర్గానికి ఒక్క పని కూడా చేయలేదని మండిపడ్డారు. బండి హామీ ఇచ్చిన మానేరు వంతెన ఏమైందని ప్రశ్నించారు. తనపై దాడి చేస్తే తప్ప మనుగడ ఉండదని భావిస్తున్న కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఈ అనైతిక చర్యకు పాల్పడినట్లు విమర్శించారు. ఎమ్మెల్యే మీద దాడి చేస్తే తప్ప తమకు మనుగడ ఉండదనే ఉద్దేశంతో కొంతమంది పత్రికా మిత్రులను సైతం రెచ్చగొడుతున్నారని విమర్శించారు.
కఠిన చర్యలు తీసుకుంటాం : సీపీ
గుండ్లపల్లి క్రాస్ రోడ్డు వద్ద జరిగిన ఘటనలో పూర్తిగా విచారణ చేసి బాధ్యులపై చట్టపరంగా కఠిన తీసుకుంటామని కరీంనగర్ సీపీ సత్యనారాయణ స్పష్టం చేశారు. ఆదివారం గుండ్లపల్లి స్టేజీ వద్ద డబుల్రోడ్డు గురించి డీసీసీ ప్రెసిడెంట్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో కొంతమంది యువకులతో ధర్నా చేస్తుండగా అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే వాహనాన్ని పక్కనే ఉన్న యువకులు వెంబడించి దాడికి యత్నించారని, వెంటనే సమాచారం అందడంతో లాఠీ చార్జ్ చేసి ప్రధానమైన వారిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. గన్నేరువరానికి చెందిన రవీందర్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, వీడియో ఆడి యో క్లిప్స్తో పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎవరైనా శాంతియుతంగా ఆందోళన చేసుకోవాలని, డీసీసీ ప్రెసిడెంట్ సత్యనారాయణ రెండు, మూడు విషయాల్లో చట్ట విరుద్ధంగా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయని, ఇది కావాలని చేసిన చర్య అనే అర్థమవుతోందన్నారు.
రసమయి వ్యక్తి కాదు..శక్తి
ఎమ్మెల్యే రసమయిపై బీజేపీ, కాంగ్రెస్ గుం డాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. రసమయి అంటే వ్యక్తి కాదని.. ఒక శక్తి.. ప్రజాస్వామికంగా నిరసన తెలపాల్సిన పార్టీలు రౌడీల్లాగా దాడులకు పాల్పడడం బాధాకరం.. కాంగ్రెస్ జిల్లా అధ్య క్షుడు తన కార్యకర్తల రూపంలో గుండా లను తయారు చేస్తున్నాడు. నియోజకవర్గంలో ఎంతో ప్రజాదరణ ఉన్న తమ ఎమ్మెల్యేకు వస్తున్న ఆదరణను తట్టుకోలేకనే.. దొంగల్లా దాడులకు దిగుతున్నారు. కవ్వంపల్లి కాంగ్రెస్ టికెట్ కోసమే రౌడియిజం చేస్తున్నడు. ఇది ఎంతమాత్రం మంచిపద్ధతి కాదు.
– టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు
దాడిని ఖండిస్తున్నాం..
వేములవాడ, నవంబర్ 13: సాంస్కృతి సారథి చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్పై జరిగిన దాడిని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు ఆదివారం తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య వ్వవస్థలో దాడులకు పాల్పడటం హేయమైన చర్య అన్నారు. అభివృద్ధిని జీర్ణించుకోలేని పిరికిపందలు మాత్ర మే ఇలాంటి చేస్తున్నట్లుగా భావిస్తున్నామని తెలిపారు. దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు రౌడీల్లా వ్యవహరించడం సరికాదన్నారు.
– ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు
హేయమైన చర్య
మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కాన్వాయ్పైన దాడి హేయమైన చర్య. ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలిపే హకు ప్రతి ఒకరికీ ఉంటుంది, ఏదైనా శాంతియుతంగా నిరసన తెలపాలి. కానీ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న రసమయిపై దాడి సరికాదు. తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం పక్షాన దీన్ని తీ వ్రంగా ఖండిస్తున్నాం. ఎమ్మెల్యే రసమయిని అడ్డుకోవాలని కాంగ్రెస్ నేతలుకొంతమంది యు వకులను రెచ్చగొట్టి ఇలాంటి చర్యలకు పాల్పడడం బాధాకరం. ఇలాంటి ఘటనలు పునరా వృతం కా కుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉన్నది.
– టీఆర్ఎస్వీ నేత చుక్క శ్రీనివాస్