కరీంనగర్ రూరల్: మార్చి 31: స్వరాష్ట్రంలోనే అభివృద్ధి పరుగులు పెడుతున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. పేద, మధ్యతరగతి వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యనందించేందుకు కేసీఆర్ సర్కారు ప్రాధాన్యమిస్తున్నదని పేర్కొన్నారు. శుక్రవారం కరీంనగర్ మండలం మొగ్దుంపూర్లోని బీసీ అగ్రికల్చర్ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ప్రహరీ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రైతాంగం సాగునీటి కోసం తండ్లాడిందన్నారు. యూరియా బస్తాల కోసం చెప్పులను లైన్లో పెట్టాల్సిన దుస్థితి ఉండేదని, కరెంట్లేక పంటలను ఎండబెట్టుకువాల్సి వచ్చేదన్నారు. కరెంట్ ఇవ్వాలని ఎండిన వరి పంటతో అసెంబ్లీకి ఆందోళన చేశామని గుర్తు చేశారు. కానీ స్వపరిపాలనలో సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతుబంధు, 24 గంటల ఫ్రీ కరెంట్, సకాలంలో విత్తనాలు, ఎరువులు అందిస్తూ రైతులకు అండగా నిలుస్తున్నారని చెప్పారు. ప్రజలు రాష్ట్రం రాకముందు, వచ్చిన తర్వాత మార్పులను ఆలోచించుకోవాలని సూచించారు. నాడు పాలన చేతగాదని వెక్కిరించిన వారే నేడు తలదించుకుంటు న్నారని విమర్శించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు అనుకూల విధానాలతో వ్యవసాయ భూముల ధరలు పెరిగాయన్నారు.
బృహత్తరమైన కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంతో మండుటెండల్లోనూ వాగులు, వంకలు జలకళతో ఉట్టిపడుతు న్నాయన్నారు. నాడు పడావు పడ్డ భూముల్లో నే డు భూమికి బరువయ్యే పంట పండుతుందన్నా రు. కాంగ్రెస్ పాలనలో మొగ్దుంపూర్లో రోడ్లు నిర్మించకపోవడంతో దుమ్ములేచే పరిస్థితి ఉండేదన్నారు. అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తున్న తె లంగాణను చూసి ఓర్వలేకే బీజేపీ ప్రభుత్వం విషం చిమ్ముతున్నదని మండిపడ్డారు. నిధులు ఇవ్వకుండా ఇబ్బందిపెడుతున్నదని ఆక్షేపించారు. ఇక్కడి నీళ్లు, నిధులు, బొగ్గు, కరెంట్ను ఎత్తుకుపోయేందుకు ఆంధ్రా నేతలు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఇటీవల వడగండ్లతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. ప్రతిరైతుకూ పరిహారం అందిస్తామని భరోసా ఇచ్చారు. ప్రజలు ఆలోచించి జీవన ప్రమాణాల పెంపునకు కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలువాలని కోరారు. మొగ్దుంపూర్లో అగ్రికల్చర్ కాలేజీ నిర్మాణానికి 75 ఎకరాలు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇప్పటికే 75 ఎకరాలు సేకరించామని తెలిపారు. మరో 30 ఎకరాల సేకరణకు చ ర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
కార్యక్రమం లో ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, కరీంనగర్ ఏఎంసీ చైర్మన్ రెడ్డవేణి మధు, డైరెక్టర్లు వెంకటేశ్వర్లు, పబ్బతి రంగారెడ్డి, సర్పంచ్ జక్కం నర్సయ్య, ఎంపీటీసీ దామెరపల్లి పుష్ప. ఉప సర్పంచ్లు కు క్కట్ల తిరుపతియాదవ్, సుంకిశాల సంపత్రావు, మూత్యం శంకర్గౌడ్, కరీంనగర్, దుర్శేడ్ సింగిల్విండో చైర్మన్లు పెండ్యాల శ్యాంసుందర్రెడ్డి, గోనే నర్సయ్య, సింగిల్ విండో వైస్ చైర్మన్ బీరం అంజనేయులు,అర్టీఏ సభ్యులు పెద్ది రమేశ్, పలు గ్రామాల సర్పంచ్లు పురుమల్ల శ్రీనివాస్, దబ్బె ట రమణారెడ్డి, భూమయ్య, ఎంపీటీసీలు బుర్ర తిరుపతిగౌడ్, లింగారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చై ర్మన్ జూవ్వాడి రాజేశ్వర్రావు, తహసీల్దార్ నారాయణ, సింగిల్ విండో డైరెక్టర్లు కందుల రమేశ్గౌడ్, దాడి లచ్చయ్య, నేరెళ్ల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు వెంకటేశ్వర్లు, పబ్బతి రంగారెడ్డి, నాయకులు అంజిరెడ్డి, రమేశ్, బలుసుల శంకర్, ఆశోక్, లక్ష్మణ్, ఆంజనేయులు, మహ్మద్, అంజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.