తిమ్మాపూర్ మార్చ్ 16: తిమ్మాపూర్ మండలం నల్లగొండ లక్ష్మీనరసింహస్వామి(Nalgonda Lakshmi Narasimha Swamy) బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్.. మండల బీజేపీ నాయకులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ కమిటీ బాధ్యులు, అర్చకులు ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వచనం చేశారు.
తాను ప్రతి సంవత్సరం నల్లగొండ జాతరకు వస్తానని, స్వామివారిని దర్శనం చేసుకుంటానని చెప్పారు. ఆలయ విశిష్టత గురించి అడిగి తెలుసుకున్నారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా జరుగుతున్న పనులను పరిశీలించారు. ఆలయ కమిటీ చైర్మన్ బండారుపల్లి లక్ష్మణ్, నాయకులు వినుకొండ నాగేశ్వర్రెడ్డి, గడ్డం అరుణ్, వేల్పుల ఓదయ్య యాదవ్, తదితరులు పాల్గొన్నారు.