Bandi Sanjay | కరీంనగర్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ య్ పోలీసులే టార్గెట్గా తన అస్ర్తాన్ని సంధిస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు కరీంనగర్ పోలీసులపై ప్రయోగించిన ప్రివిలేజ్ అస్ర్తాన్ని ఈ సారి, కరీంనగర్, వరంగల్ జిల్లాల పోలీసులపై ప్రయోగిస్తున్నారు. పదోతరగతి పరీక్ష ప్రశ్న పత్రాల లీకేజీల వ్యహారంలో పోలీసులు చేసిన అరెస్టు వల్ల తన హక్కులకు భంగం కలిగిందంటూ, మరోసారి ఆయన తన నిజస్వరూపాన్ని బయట పెట్టడంతో పాటుగా లోకసభ స్పీకర్కు, ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లో పోలీసులను ఈ సారి వదలిపెట్టేదే లేదంటూ హెచ్చరికలు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి బండికి ఇదో తంతుగా మా రిందన్న విమర్శలు వస్తుండగా, గడిచిన రెండ్రోజులుగా జరిగిన అరెస్టు వ్యవహారంలో ఇప్పటికే బీజేపీ ఎంపీలు కొంత మంది స్పీకర్కు, ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారని తెలుస్తోంది.
ఇప్పటికే స్పీకర్కు సీపీ మెయిల్
పదోతరగతి ప్రశ్నపత్రాల లీకేజీ, దానికి ముందు ప్రశాంత్కు బండికి మధ్య జరిగిన వా ట్సాప్ చాట్లు, ఫోన్కాల్స్ వంటి పలు అంశాలను పరిగణలోకి తీసుకొని, వరంగల్ పోలీసు లు బండిని అరెస్టు చేయడం తెలిసిందే. దీనికి ముందస్తు జాగ్రత్త కింద సంజయ్ను కరీంనగర్ పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేయడం, వదిలిపెట్టడం, ఆ తర్వాత వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యవహారానికి సంబంధించిన మొత్తం వివరాలను లోకసభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిల్లాకు కరీంనగర్ సీపీ సుబ్బారాయుడు మెయిల్ ద్వారా అదే రోజు తెలియజేసిన విషయం తెలిసిందే. ప్రతి విషయంలో రాజ్యాంగబద్ధంగా పోలీసులు వ్యవహరించగా, తన హక్కులకు భంగం కలిగేలా పోలీసులు ప్రవర్తించారని, అరెస్టుల పేరుతో తనను ఇబ్బందులు పెట్టారని, ఈ సారి కరీంనగర్, వరంగల్ పోలీసుల అంతు చూసే దాకా వదిలిపెట్టేదే లేదని, స్వయంగా బండియే స్పష్టం చేశారు. శుక్రవారం కరీంనగర్ జైలు నుంచి విడుదలైన తర్వాత ఆ పరిసర ప్రాంతాల్లోనే ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పోలీసులపై పలు విమర్శలు చేస్తూనే, వారి తీరుపై లోకసభ స్పీకర్కు, ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. కాగా ఇ ప్పటికే ఈ వ్యవహారంలో బీజేపీకి చెందిన కొం త మంది ఎంపీలు స్పీకర్కు ఫిర్యాదు చేసారని తెలుస్తోంది. బండి సంజయ్ అరెస్టుకు సంబంధించి తాము రాజ్యాంగబద్ధంగా వ్యవహరించామని పోలీసులు పదే పదే చెబుతున్నా ఆ మా టను పెడచెవిన పెడుతూ ఫిర్యాదుల పరంపర సాగిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ సారి కరీంనగర్, వరంగల్ పోలీసులను ఢిల్లీకి పిలిపించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు.
అరెస్టయితే చాలు ఫిర్యాదే..
నిజానికి బండి సంజయ్ నాలుగేళ్లుగా ఇదే తరహాలో వ్యవహరిస్తున్నారు. 2019లో ఆర్టీసీ స మ్మె సందర్భంగా ఆర్టీసీ కార్మికుడు బాబు ఆకస్మికంగా మృతిచెందితే శవరాజకీయం చేశారు. అతడి మృతదేహంతో ధర్నా చే సేందుకు బండి సంజయ్ శతవిధాలా ప్రయత్నాలు చేశారు. అ ప్పటి ఇన్చార్జి సీపీ సత్యనారాయణ ఉన్నారు. శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకొని అరెస్టు చేస్తే.. పోలీసులు తనపై దురుసుగా ప్రవర్తించారని పార్లమెంట్ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. జరిగిన సంఘటపై పోలీసులు వివరణ ఇవ్వడంతో పాటు సాక్ష్యాధారాలను స్పీకర్ ముందు పె ట్టా రు. ఈ విషయంలోనూ రెండు మూడు సార్లు పోలీసులు ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. 2022 జనవరి 2న జీవో 317ను రద్దు చేయాలని సంజ య్ పార్టీ కార్యాలయంలో జాగరణ్ దీక్ష చేపట్టనున్నట్లుగా ప్రకటించారు. ఆప్పుడు ఉన్న కొ విడ్ నిబంధనలు, కేంద్రం నుంచి ఉన్న ఆదేశా లు, ఇతరత్రా విషయాలను పరిగణలోకి తీసుకొని అనుమతించలేదు. అయినా దీక్ష చేయడంతో పోలీసులు అరెస్టు చేశారు.
ఈ విషయంలోనూ పోలీసులు తన పట్ల దురుసుగా ప్రవర్తించారని, రాజ్యాంగ బద్ధమైన హోదాలో ఉన్న ఎంపీగా తనకు గౌరవం ఇవ్వలేదని, నిబంధనలకు విరుద్ధంగా అరెస్టు చేశారంటూ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. అప్పటి సీపీ సత్యనారాయణ, ఏసీపీ తుల శ్రీనివాస్తోపాటు పలువురు సీఐలు, ఎస్ఐలు ఢిల్లీ కమిటీ ముందు ప లు మార్లు హాజరవ్వాల్సి వచ్చింది. అలాగే అదే నెలలో బీసీ సామాజిక వర్గానికి చెందిన తనను పోలీసులు ఇబ్బంది పెట్టారంటూ బీసీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటి సీపీ సత్యనారాయణ, ఏ డీసీపీ చంద్రమోహన్ కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. 2022 నవంబర్ 27న భైంసా సభకు అనుమతి లేదంటూ జగిత్యాల సమీపంలో పోలీసులు అరెస్టు చేసి అదే రోజు రాత్రి కరీంనగర్లోని ఆయన నివాసంలో దింపి వెళ్లిపోయారు. ఈ విషయంలో నూ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తామని మొ దట చెప్పారు. కానీ చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు. తా జాగా ఈ నెల 5న తెల్లవారు జా మున 12.15 గంటలకు ఎస్సెస్సీ పేపర్ లీకేజీ కేసులో భాగంగాసంజయ్ను కరీంనగర్ పోలీసులు ముందుజాగ్రత్తగా ఆరెస్టు చేశారు.
అరెస్ట్కు కారణాలను చాలాసేపు పోలీసులు సంజయ్కు ఆయన ఇంటిలోనే వివరించారు. అయి నా వినకుండా మొండిగా వ్యవహరించినా పోలీసులు ఓపికతో వారి పని పూర్తి చేశారు. పోలీసులు నచ్చచెప్పినా వినకుండా బండి సంజయ్ అనుచరులు ప్రతిఘటించారు. నిజానికి ఈ వ్యవహారాన్ని అంతా కరీంనగర్ జిల్లా సీపీ సుబ్బారాయుడు లోకసభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లాకు మెయిల్ ద్వారా తెలిపారు. ఆ తర్వాత వరంగల్ పోలీసులు సంజయ్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుచగా శుక్రవారం ఆయన బెయిల్పై కరీంనగర్ జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. విడుదలైన మరుక్షణమే ఆయన పోలీసులపై విరుచుకుపడ్డారు. అనేక రకాల విమర్శలు చేశారు. చివరగా లోకసభ స్పీకర్కు, ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదుచేసి తీరుతామని చెప్పడమేకాకుండా, వారిని ఈసారి వి డిచిపెట్టే ప్రసక్తేలేదంటూ హెచ్చరిస్తూ మాట్లాడా రు. గతంలో కరీంనగర్ పోలీసులను మాత్రమే లక్ష్యంగా పెట్టుకోగా, ఈ సారి ఇటు కరీంనగర్, అటు వరంగల్ జిల్లా పో లీసులను టార్గెట్ చేశారు. కానీ పోలీసులు మా త్రం ప్రతి విషయంలోనూ రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించామని, అన్ని ఆధారాలను కమిటీ ముందు పెట్టేందుకు తాము సిద్ధమని చెబుతున్నారు. కాగా, ఒక ఎంపీగా ప్రతిసారి పోలీసులనే టార్గెట్చేస్తూ ఫిర్యాదుల పరంపరను కొసాగించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.