Bandi Bhagirath | మంథని, రూరల్, మే11 : బీజేపీ నాయకుడు, కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ను పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని భూపాలపల్లి జడ్పీ మాజీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణీ రాకేష్ డిమాండ్ చేశారు. మంథని పట్టణంలోని రాజా గృహలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేసిన బండి సంజయ్ కుమారుడు బండి భగీరథను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతుందన్నారు.
కాంగ్రెస్ బిజెపి పార్టీలు ఒకటై మహిళలకు తీరని అన్యాయం చేస్తున్నాయన్నారు. మహిళలకు అండగా ఉంటామని, రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఇద్దరు కలిసి ఆ మైనర్ బాలిక కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నారన్నారు. అందులో భాగంగానే భగీరథను అరెస్టు చేయకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. భగీరథను అరెస్టు చేయకుంటే బిఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు.