మల్లాపూర్ మండలంలోని మొగిలిపేటలో మత సామరస్యం వెల్లివిరిసింది. గ్రామానికి చెందిన ముస్లిం యువకుడు ఎండీ మహబూబ్ఖాన్ బుధవారం అయ్యప్ప దీక్షాపరులకు భిక్ష ఏర్పాటు చేశారు.
కొన్నేండ్లుగా అయ్యప్పస్వాములకు అన్నదానం చేస్తూ మతసామరస్యాన్ని చాటిన యువకుడిని గ్రామస్తులు అభినందించారు.
– మల్లాపూర్, డిసెంబర్ 13