బోథ్ : అడవులను ప్రతీ ఒక్కరూ బాధ్యతగా సంరక్షించాలని బోథ్ అటవీ రేంజి అధికారి సత్యనారాయణ అన్నారు. బుధవారం మండలంలోని పిప్పల్ధరిలో అడవుల సంరక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎఫ్ఎస్వో సుందర్ మాట్లాడుతూ.. అడవిలోని చెట్లు నరికితే సమాచారం అందించాలన్నారు. ప్రభుత్వం హరితహారం కార్యక్రమంతో గ్రామాల్లో చెట్లు పేంచే కార్యక్రమం చేపట్టిందన్నారు. అడవిని కాపాడితే బావి తరాలకు మనం మేలు చేసిన వారమవుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బీ.శ్రీధర్రెడ్డి, వార్డు సభ్యులు, అటవీ సిబ్బంది పాల్గొన్నారు.