cybercrime | పాలకుర్తి : పాలకుర్తి మండలం రామారావు పల్లి గ్రామంలో బసంత్ నగర్ ఎస్సై స్వామి ఆధ్వర్యంలో గ్రామస్తులు కలిసి మాదకద్రవ్యాల నియంత్రణ, సైబర్ నేరాలపై శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై స్వామి మాట్లాడుతూ గ్రామంలో యువత చెడు దారిన పట్టకుండా గ్రామస్తులు అందరూ గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వాడకంపై నిఘా ఉంచాలన్నారు.
గ్రామంలో నూతనంగా సీసీ కెమెరాలు ఇన్ స్టాల్ చేశామని, ప్రతీ ఒక్కరూ సీసీ కెమెరా కంట్రోల్ లో ఉన్నారని, ఎలాంటి సంఘవిద్రోహక అవాంఛనీయ చర్యలు చేపట్టడానికి వీలు లేదని ఎస్సై తెలిపారు. అదేవిధంగా సెల్ఫోన్ మూలంగా ఎక్కువగా సైబర్ నేరాలు అధికమవుతున్నాయని, సైబర్ నేరాలపై అందరూ దృష్టి సారించాలని ప్రజలకు వివరించారు. ర్యాలీలో గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు.