ఆటోలకు సరైన గిరాకీ లేక తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ప్రభుత్వం ఆదుకోవాలని ఆటో, మ్యాజిక్, జీపు డ్రైవర్లు విజ్ఞప్తి చేశారు. ప్రతి డ్రైవర్కు పింఛన్ అమలు చేసి, ప్రతి వాహనంపై గ్రీన్ ట్యాక్స్ ఎత్తివేయాలని, పరిమితి ఫిట్నెస్ ట్యాక్స్ చలాన్లు ఎత్తివేయాలని కోరారు.
ఈ మేరకు జగిత్యాల జిల్లాలోని రాయికల్, మెట్పల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేటలో ధర్నాలు చేసి, అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.
– మెట్పల్లి/ రాయికల్, డిసెంబర్ 13