Chigurumamidi | చిగురుమామిడి, మే 16 : కరీంనగర్ జిల్లావ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ల భర్తీని ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలోనే భర్తీ చేయునున్నట్లు జిల్లా శిశు సంక్షేమ అధికారిణి మార్త సరస్వతి అన్నారు. చిగురుమామిడి మండలంలోని లంబాడిపల్లె గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాలో 61 అంగన్వాడీ టీచర్లు 232 ఆయా పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. రిజర్వేషన్లు ఆధారంగా ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయున్నామని చెప్పారు. ముందుగా 61 అంగన్వాడీ టీచర్ల భర్తీ అనంతరం ఆయాల పోస్టులను పూర్తి చేస్తామని వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
లంబాడిపల్లి లో నిరుపయోగ ఉంటున్న నిరుపయోగంగా ఉంటున్న అంగన్వాడీ కేంద్రంలో రాబోయే విద్యా సంవత్సరానికి ఇన్చార్జి అంగన్వాడి టీచర్లతో అంగన్వాడీ కేంద్రాన్ని నడిపిస్తున్నామని, ఇందుకు గ్రామస్తులు పూర్తిస్థాయిలో సహకారం అందించాలని సూచించారు. అనంతరం గ్రామపంచాయతీ వద్ద గ్రామస్తులతో మాట్లాడారు. గ్రామం నుండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సర్పంచ్ కాటం సంపత్ రెడ్డి పేర్కొన్నారు. వీరి వెంట సీడీపీవో శ్రీలత, సూపర్వైజర్ ఇస్రాత్ సుల్తానా, ఉప సర్పంచ్ నక్క ఓదేలు, పంచాయతీ కార్యదర్శి పద్మావతి, అంగన్వాడీ టీచర్లు వరలక్ష్మి, అనురాధ, ధనలక్ష్మి, వార్డు సభ్యులు ఉన్నారు.