గంభీరావుపేట, అక్టోబర్ 4: గోరంటాలలో అధునాతన రైస్మిల్లు ఏర్పాటు చేస్తున్నామని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు ప్రకటించారు. రాష్ట్రంలోనే మొదటిసారి పైలెట్ ప్రాజెక్టులో భాగంగా అత్యాధునిక మిషన్లతో నిర్మిస్తున్నామని చెప్పారు. గంభీరావుపేట మండలం గోరంటాలలో బుధవారం రైస్మిల్లు నిర్మాణ పనులు. నర్మాలలో 25 లక్షలతో చేపట్టనున్న గ్రంథాలయ భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. 3.30 కోట్లతో 4 టన్నుల సామర్థ్యంతో రైస్మిల్లును నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. దీని ద్వారా ఈ ప్రాంత రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. సీఎం కేసీఆర్ సహకారం, మంత్రి కేటీఆర్ ప్రోద్బలంతో పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని చెప్పారు.
కార్యక్రమంలో టీడీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర నేత చీటి నర్సింగారావు, ఎంపీపీ వంగ కరుణ, జడ్పీటీసీ కొమిరిశెట్టి విజయ, సర్పంచ్లు కొలుముల అంజమ్మ, ఎడబోయిన రాజు, ఆర్బీఎస్ జిల్లా కోఆర్డినేటర్ గడ్డం నర్సయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, నాబార్డు డీడీఎం మనోహర్రెడ్డి, సెస్ డైరెక్టర్ గౌరినేని నారాయణరావు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాపాగారి వెంకటస్వామిగౌడ్, ఉప సర్పంచులు శోభారాణి, తిరుపతిరెడ్డి, ఎంపీటీసీ బాలమణి, ఆర్బీఎస్ చైర్మన్ రాజేందర్, సింగిల్ విండో వైస్ చైర్మన్ ఎర్ర రామాంజగౌడ్, సీఈవో రాజిరెడ్డి, సలహాదారు పురం సత్యంరావు, జడ్పీకోఆప్షన్ అహ్మద్, నేతలు వంగ సురేందర్రెడ్డి, కొలుముల బాల్రెడ్డి, సురేందర్, అంజిరెడ్డి, కమ్మరి రాజారాం, వహీద్, చెవుల మల్లేశం, రవీందర్రెడ్డి పాల్గొన్నారు.