పెద్దపల్లి, ఫిబ్రవరి25: ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా చేపట్టిన పెద్దపల్లి రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనుల శంకుస్థాపన కార్యక్రమాన్ని రైల్వే బోర్డు సభ్యులు, బీజేపీ నాయకులు బహిష్కరించారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీంలో భాగంగా రూ.26. 49 కోట్ల అంచనాతో చేపట్టనున్న పెద్దపల్లి రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి, అధునీకరణ పనుల ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేసే కార్యక్రమానికి ఆహ్వానించి, వేదిక పైకి పిలువలేదని బోర్డు సభ్యులు, బీజేపీ నాయకులు పోల్సాని సంపత్రావు, రాజేశ్వర్రావు, దాడి సంతోశ్, మేకల శ్రీనివాస్, ఏ శ్రీకాంత్, కావేటి రాజగోపాల్, ఆవుల శ్రీనివాస్ రైల్వే అధికారులపై మండిపడ్డారు. ఇది కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమమని, కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కాదని అసహనం వ్యక్తం చేస్తూ బయటకు వెళ్లిపోయారు.