మంథని రూరల్, నవంబర్ 27: ‘అసెంబ్లీ ఎన్నికల అంఖం అఖరు దశకు చేరిన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు కుట్రలకు తెరలేపారు. రౌడీషీటర్లు, మాజీ నక్సల్స్ ముసుగులోని గుండాలను తనను అంతమొందించేందుకు యత్నిస్తున్నారు.’ అంటూ మంథని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ సంచలన ఆరోపణలు చేశారు. తనను గెలిపిస్తే గుంజపడుగును మండలంగా ఏర్పాటు చేస్తానని, ఆరెంద మానేరుపై బ్రిడ్జిని నిర్మిస్తానని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ సహకారంతో రూ. వెయ్యి కోట్లు మంజూరు చేయించి గుంజపడుగుతో పాటు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలుపుతానని ప్రకటించారు. సిరిపురం బరాజ్ను టూరిజం స్పాట్గా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు.
సోమవారం ఆయన మంథని మండంలోని గుంజపడుగు, నాగారం, ఆరెంద, నాగేపల్లి గ్రామాల్లో ముమ్మరంగా ప్రచారం చేశా రు. పుట్ట మధూకర్కు ప్రజలు అడుగడుగునా ఘ న స్వాగతం పలికారు. మహిళలు నుదుట తిలకందిద్ది ఆశీర్వదించారు. అనంతరం మాట్లాడుతూ గుంజపడుగు మండల ఏర్పాటుతో అన్ని ప్రభు త్వ కార్యాలయాలను ఏర్పాటు చేస్తామని, వ్యాపా ర, వాణిజ్య సంస్థలు మరింత పెరిగి ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. అలాగే ఇక్కడ జూనియర్ కళాశాలను సైతం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. మంథని నుంచి తనను గెలిపిస్తే రూ. వెయ్యి కోట్ల నిధులను కానుకగా అందజేస్తానని స్వయంగా సీఎం కేసీఆరే ప్రకటించారన్నారు. అనేక సంవత్సరాలు మంథనిని ఒకే కుటుంబం పాలిస్తున్నదన్నారు. వారు పాలనను గాలికొదిలి స్వంత ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని ఆరోపించారు.
వారిపాలనలో ప్రజానీకం అరిగోసపడ్డదని చెప్పారు. మంథని ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లి అభివృద్ధి పనులు చేయాలని అడిగితే మా ప్ర భుత్వం లేదని తప్పించుకున్నాడని మండిపడ్డా రు. కేవలం ఎన్నికల సమయంలోనే వచ్చి ఓట్ల కో సం నోట్ల సంచులు తీసుకువచ్చి ప్రజలను మభ్యపెడుతున్నాడని ధ్వజమెత్తారు. పార్టీలో ఉన్నప్పు డు తనను దేవుడని గొప్పలు చెప్పినోళ్లు ఈనాడు పార్టీ మారి తనను బదనాం చేసున్నారని, లేనిపోని ఆరోపణలు చేసున్నారని అన్నారు. రామగిరికి చెందిన ఓ ప్రజాప్రతినిధి ఏకంగా తనను బెదిరింపులకు గురి చేసిన రికార్డులు ఉన్నాయని మీడి యా ముందు చెప్పి కాంగ్రెస పార్టీలో చేరి ఐదు రోజులైనా ఒక రికార్డును బయటపెట్టలేదన్నారు.
తాను ఏనాడు తప్పు చేయలేదని, ఎవరిని బెదిరిం చలేదని స్పష్టం చేశారు. తనకు గతంలో ఒక్కసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే నిరుపేదలకు ఎంతో సాయం చేశానని చెప్పారు. అలాగే విద్యార్థులకు అండగా నిలిచానన్నారు. పేదింటివాళ్లకు వివాహా లు జరిపించానని చెప్పారు. ప్రజలు ఆలోచించాలని, అందుబాటులో ఉండే తనను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించాలని విజ్ఞప్తి చేశారు. గెలిచిన వెంటనే గృహలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి లాంటి మహత్తర స్కీంలను అమలు చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు కుంట రాజయ్య, సరోజన, మాసిరెడ్ది శ్రీకళ జనార్దన్రెడ్డి, కొత్త శ్రీనివాస్, కనవేవననివాస్ యాదవ్, ఆకుల కిరణ్, ఎగోళపు శంకర్ గౌడ్, ఎక్కెటి అనంతరెడ్డి, తగరం శంకర్లాల్, మిరియాల ప్రసాద్రావు, బెల్లంకొండ ద యాకర్రెడ్డి, ప్రకాశ్రెడ్డి, దృవకుమార్, కండె రమే శ్, బానేశ్, మహేందర్, ఉపేందర్, రాజేందర్రెడ్డి, పుట్ట ముఖేష్, మందల మల్లారెడ్డి, బిరుదు శ్రీనివాస్ ఉన్నారు.
పుట్ట మధూకర్కు గుంజపడుగు బ్రహ్మరథం పట్టింది. ఆయన ప్రచారానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. గ్రామ పొలిమెరనుంచి మధూకర్కు పూలు జల్లుతూ ఘన స్వాగతం పలికారు. భారీ ర్యాలీగా గ్రామ ప్రధాన కూడలి వద్దకు తీసుకెళ్లారు. మహిళలు కోలాటలా నృత్యాలు చేస్తురాగా యువకులు భారీ గులాబీ జెండాలను ప్రదర్శిస్తూ సందడి చేశారు.
మంథని రాజగృహలో సోమవారం పుట్ట మధూకర్ సమక్షంలో ఇతర పార్టీ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. ముత్తారం మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి అమ్ము శ్రీనివాస్, అలువోజు మహేందర్, మంథని మండలం స్వర్ణపల్లికి చెందిన యువకులు, మైదుపల్లి మాజీ ఉప సర్పంచ్ కేతం రవి, కేతం రాములు, మండలంలోని భట్టుపల్లి గ్రామానికి చెందిన 50 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, గుంజపడుగుకు చెందిన ఇతర పార్టీల నాయకులతో పాటు దాదాపు 50 మంది మహిళలు, సింగిరెడ్డిపల్లెకు చెందిన యువకులు వేర్వేరుగా గులాబీ కండువాలు కప్పుకున్నారు. ఆనంతరం మధూకర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో జరిగిన అభివృద్ధి, అందిన సంక్షేమ పథకాలపై ప్రజలకు మరింత వివరించాలన్నారు. యువత సైతం సోషల్ మీడియాను వేదికగా చేసుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, తాను చేసిన అభివృద్ధి.. అందించిన సేవా కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కోరారు. పార్టీ గెలపునకు కృషి చేయాలని విజ్ఞప్తిచేశారు.