కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 2023 సంవత్సరానికి గానూ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఢిల్లీకి చెందిన అపూర్వ టండన్ గురువారం కొత్తపల్లిలోని కాలేజీకి వచ్చి ప్రిన్సిపాల్ శీల లక్ష్మీనారాయణ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సంతన్ సమక్షంలో మొదటి అడ్మిషన్ తీసుకున్నారు.
ఎంబీబీఎస్ ఫస్టియర్లో వంద సీట్లను కేటాయించగా, నీట్లో ర్యాంకుల ఆధారంగా విద్యార్థులు ఈ కాలేజీలో చేరనున్నారు. ఇప్పటికే కళాశాలలో తరగతి గదులతోపాటు వసతి గృహాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చారు.
– విద్యానగర్, ఆగస్టు 3