EVM godown | కరీంనగర్ కలెక్టరేట్, ఆగస్ట్ 8 : కరీంనగర్ జిల్లా కేంద్రoలోని కలెక్టర్ కార్యాలయం సమీపంలో గల ఈవీఎంల గోదాంను అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, ఆర్డీవో కే మహేశ్వర్ తో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గనిర్ధేశాల మేరకు ఎప్పటికప్పుడు ఈవీఎం, వీవీప్యాట్ గోదాంను తనిఖీచేసి సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు తెలిపారు.
ఈవీఎం ల రక్షణ భద్రతకు సంబంధించిన ఏర్పాట్ల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం గోదాo వద్ద సిబ్బంది హాజరు తీరుపై ఆరా తీశారు. ఈవీఎం గోడౌన్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈవీఎం, వీవీ ప్యాట్ గదుల ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి మడుపు మోహన్, బీఆర్ఎస్ ప్రతినిధి సత్తినేని శ్రీనివాస్, బీజేపీ ప్రతినిధి నాంపల్లి శ్రీనివాస్, ఎంఐఎం ప్రతినిధి అబ్బాస్ సమీ, బర్కత్ ఆలీ, టీడీపీ ప్రతినిధి కళ్యాడపు ఆగయ్య తదితరులు పాల్గొన్నారు.