కలెక్టరేట్, డిసెంబర్ 3: దివ్యాంగులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ జీవీ శ్యాం ప్రసాద్లాల్ పేర్కొన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలో స్త్రీ, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన దివ్యాంగుల ర్యాలీని ఆయన ప్రారంభించి, మాట్లాడారు. దివ్యాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాగా, ర్యాలీ మహాత్మా జ్యోతిబా ఫూలే మైదానం నుంచి కలెక్టరేట్ వరకు కొనసాగింది. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి సబితా కుమారి, డీఆర్డీవో శ్రీలత, మెప్మా పీడీ రవీందర్, దివ్యాంగుల సంక్షేమ సంఘం బాధ్యులు వెన్నం శ్రీనివాస్, జకం సంపత్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.
కమాన్చౌరస్తా, నవంబర్ 3: తకువ నిడివిలో సమాజ ఉపయోగకర సందేశాలిచ్చే లఘు చిత్రాలను అందరూ ప్రోత్సహించాలని అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్లాల్ కోరారు. నగరంలోని ఫిలింభవన్లో కఫిసో ఆధ్వర్యంలో చిన్నితెర కార్యక్రమంలో భాగంగా అనసూరి భూనాథాచారి దర్శకత్వంలో వచ్చిన గోదారి ఫిల్మ్స్ వారి ‘అధర్వ’, రాము మొగిలోజు దర్శకత్వం వహించిన మన విలేజ్ సినిమా వారి ‘ఆరు గజాల చీర’ చిత్రాల ప్రదర్శనకు శనివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిత్రాలను విడుదల చేసి మాట్లాడారు. నేటి కాలంలో మంచి లఘు చిత్రాలను యువ దర్శక, నిర్మాతలు తీసుకొస్తున్నారన్నారు. సమాజం మెచ్చే సందేశాత్మక చిత్రాలకు సముచిత స్థానం దకుతుందని చెప్పారు. చిత్రాల బాధ్యులను అభినందించారు. కఫిసో అధ్యక్షుడు పొన్నం రవిచంద్ర అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి లక్ష్మీ గౌతమ్, నాగభూషణం, మహేశ్, వెంకటేశ్వర్ రావు, నార్ల చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.