పెద్దపల్లి, నవంబర్ 27: బీజేపీ అసత్య ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టేందుకు టీఆర్ఎస్(బీఆర్ఎస్) ప్రతి కార్యకర్త ఒక సోషల్ మీడియా వారియర్గా మారాలని టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్, టీఎస్ రెడ్కో చైర్మన్ వై సతీశ్ రెడ్డి పిలుపునిచ్చారు. మోదీ సర్కారు ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ, కార్పొరేట్ శక్తులకు అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నదని విమర్శించారు. పెద్దపల్లి జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం పెద్దపల్లి నియోజకవర్గస్థాయి యువజన సమ్మేళనం, సోషల్ మీడియా అవగాహన సదస్సును ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్యక్షతన నిర్వహించారు.
ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా సతీశ్రెడ్డి హాజరై మాట్లాడారు. కేంద్రంలో ఉన్న బీజేపీ కేవలం అసత్యాలను ప్రచారం చేస్తూ, పబ్బం గడుపుకుంటున్నదని, దినదినం ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతున్నా, అదానీ ఆదా యం మాత్రం పెరుగుతున్నదని బీజేపీ ఆనందపడుతున్నదని, కానీ దేశ ఆర్థిక పరిస్థితి మెరుగు చేయడంపై ఆలోచించడం లేదని దుయ్యబట్టా రు. ప్రధాని మోదీకి అదానీ, అంబానీపై ఉన్న ప్రేమ పేదలపై లేదని అవేదన వ్యక్తం చేశారు.
రూ.18 వేల కోట్లకు ఒక మునుగోడు ఉప ఎన్ని క తెచ్చిన ఘనత బీజేపీదే అని ఎద్దేవా చే శారు. దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర గవర్నర్ రాజకీయాలపై టీవీ డిబేట్లో పాల్గొన డం శోచనీయమన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలనలో దేశంలో ఎకడా లేనివిధంగా అభివృద్ధి సంక్షేమం చేస్తుంటే, ఓర్వలేని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర మంత్రులు, నాయకులపై ఈడీ, ఐటీ అంటూ ముప్పేట దాడి చేస్తున్నదని ధ్వజమెత్తారు.
ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, అసత్యాలు అబద్ధాలు మాత్రమే ప్రతిపక్షాల ఆయుధాలని, అభివృద్ధి, సంక్షేమా లు టీఆర్ఎస్ పార్టీ ఆయుధాలని తెలిపారు. ప్ర తిపక్ష నాయకుల ఆరోపణలను ప్రతీ కార్యకర్త తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం స తీశ్ రెడ్డిని ఎమ్మె ల్యే సన్మానించారు. సమావేశం లో పార్టీ ప్రజాపతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.