Kolanur | ఓదెల జనవరి 31: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూర్ సమ్మక్క సారలమ్మ జాతరలో శనివారం సాయంత్రం అమ్మవార్ల వన ప్రవేశం సందర్భంగా భక్తుల్లో భక్తి పారవశ్యం ఉప్పొంగింది. శనివారం సాయంత్రం వేళ సమ్మక్క సారలమ్మ లను తిరిగి వన ప్రవేశం చేయించే క్రమంలో కోయ పూజారులు వెళుతుండగా భక్తులు నేలపై పడుకోవడంతో వారి పైనుంచి వనదేవతలను తీసుకువెళ్లారు.
జాతరలో దారి పొడవునా భక్తులు కోయ పూజారులు పూనకంతో వస్తుండగా నేలపై ఒకరిపై ఒకరు పడుకోవడం ఆకర్షించింది. అమ్మవార్లు తమను చల్లగా చూడాలని భక్తి భావంతో ఇలా నేలపై పడుకున్నారు.