పెద్దపల్లి పట్టణం ముత్యాల పోచమ్మ వాడకు చెందిన 98 ఏళ్ల మంథని వెంకటమ్మ, 71 ఏండ్ల ఆమె కొడుకు మంథని వెంకటేశం కలిసి గురువారం పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.
ఓటు హక్కు వచ్చిన నాటి నుంచి ఓటు వేస్తున్నానని వెంకటమ్మ సంబురంగా చెప్పారు. కాగా వారిని పోలింగ్ సిబ్బంది అభినందించారు.
– పెద్దపల్లి, నవంబర్ 30