జిల్లాలో శాసన సభ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. కరీంనగర్, చొప్పదండి, మానకొండూర్, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కాగా, పలుచోట్ల రాత్రి వరకూ కొనసాగింది. ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కేంద్రాల వద్ద బారులు తీరి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.
అక్కడక్కడా ఈవీఎంల మొరాయింపువంటి చిన్న చిన్న ఘటనలు మినహా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగింది. సాయంత్రం 5 గంటల వరకు కరీంనగర్లో 64.17 శాతం, చొప్పదండిలో 70.25 శాతం, మానకొండూర్లో 75.12 శాతం, హుజూరాబాద్లో 70.23 శాతం చొప్పున జిల్లా వ్యాప్తంగా 69.22 శాతం పోలింగ్ నమోదైంది.
– కరీంనగర్, నవంబర్ 30(నమస్తే తెలంగాణ)