బండలింగాపూర్లో 56 అడుగుల రాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్
మెట్పల్లి రూరల్, జూన్ 9: మెట్పల్లి మండలం బండలింగాపూర్ శివారు గండి హనుమాన్ ఆలయ ఆవరణలో కోదండరాముడి భారీ విగ్రహం కొలువుదీరింది. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం సొంత ఖర్చులతో 56 అడుగుల రాముడి విగ్రహాన్ని నిర్మించారు. కాగా, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, మంత్రి కొప్పుల ఈశ్వర్లతో కలిసి మంత్రి కేటీఆర్ శుక్రవారం ఆవిష్కరించారు.
అనంతరం సహచర మంత్రులు, ఎమ్మెల్యేతో కలిసి గండిహనుమాన్ ఆలయంలో కేటీఆర్ ప్రత్యేక పూ జలు చేశారు. అంతకుముందు శ్రీ త్రిదండి దేవనాథ శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామిచే ప్రాణ ప్రతిష్ఠ, యంత్ర, శిఖర, విగ్రహ ప్రతిష్ఠ చేశారు.