ప్రభుత్వం నిరుపేదలకు సొంతిండ్లు నిర్మించాలనే లక్ష్యంతో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. పట్టణాలు, పల్లెల్లో దశల వారీగా ఇండ్లు నిర్మించి పారదర్శకంగా లబ్ధిదారులకు ఆత్మగౌరవ సౌధాలు ముస్తాబు అందిస్తున్నది. ఇదే తరహాలో ముస్తాబాద్ మండలం పోతుగల్లోని ఎస్సీ కాలనీలో 24, బీసీ కాలనీలో 24 చొప్పున డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించారు. ఈ ఇండ్ల సముదాయంలో సకల సౌకర్యాలు కల్పించారు. సీసీరోడ్డును నిర్మించారు. తాగునీరు, లైటింగ్ వసతులు కల్పించారు. గృహ సముదాయ ఆవరణలో నాటిన మొక్కలు ఏపుగా పెరగడంతో ఆహ్లాదకర వాతావరణం నెలకొన్నది. త్వరలోనే మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా సామూహిక గృహప్రవేశాలు చేయిస్తామని అధికారులు చెబుతున్నారు. కాగా, ఇన్నాళ్లూ అద్దె ఇండ్లు, రేకుల షెడ్లలో బతుకెళ్లదీసిన నిరుపేదలు అన్ని హంగులతో రూపుదిద్దుకున్న ఇండ్లను చూసి సంతోషంలో మునిగితేలుతున్నారు. తమ సొంతింటి కల నెరవేర్చిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కుజీవితాంతం రుణపడి ఉంటామని చెబుతున్నారు.
ముస్తాబాద్ మండలంలోని పోతుగల్లో ఆత్మగౌరవ సౌధాలు సిద్ధమయ్యాయి.. అపార్ట్మెంట్లకు దీటుగా కార్పొరేట్ హంగులతో ముస్తాబయ్యాయి. ఇటీవలే లబ్ధిదారుల ఎంపిక పూర్తికాగా, త్వరలోనే మంత్రి రామన్న చేతులమీదుగా ఒకేసారి 48 మందితో సామూహిక గృహప్రవేశాలు చేయించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిరుపేదలసొంతింటి కల నెరవేరుతుండగా ఆయావర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
– ముస్తాబాద్, ఆగస్టు 28
రామన్నకు అండగా ఉండాలి
పోతుగల్లోని ఎస్సీ, బీసీ కాలనీల్లో 24 చొప్పున 48 డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించారు. ఇందుకు అడిగిన వెంటనే మంత్రి కేటీఆర్ నిధులు మంజూరు చేశారు. అయితే కరోనా వల్ల నిర్మాణంలో కొంత జాప్యం జరిగింది. ఏదిఏమైనా త్వరలోనే ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించనున్నారు. ఇంత మంచి ఇండ్లు నిర్మాణానికి నిధులిచ్చిన మంత్రి రామన్నకు లబ్ధిదారులు అండగా నిలువాలి.
– తన్నీరు బాపురావు, పోతుగల్ సహకార సంఘం అధ్యక్షుడు (పోతుగల్ )
సంతోషంగా ఉన్నది
ఎంపీటీసీగా తన పదవీ కాలంలో 48 మంది పేదలకు సొంతింటి కల సాకారమతున్నందున సంతోషంగా ఉన్నది. పూరి గుడిసెల్లో, అద్దె గదులు, రేకుల షెడ్డుల్లో భార్యా బిడ్డలను పోషించుకుంటున్న అభాగ్యులకు ప్రభుత్వం పైసా ఖర్చులేకుండా ఇండ్లు నిర్మించి ఇవ్వడం గొప్ప విషయం. లబ్ధిదారుల తరుఫున ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
– కొండని బాలకిషన్, ఎంపీటీసీ, (పోతుగల్)
అన్ని సౌకర్యాలతో ఇండ్లు..
మంత్రి కేటీఆర్ సహకారంతో పొతుగల్లో 48 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించారు. ఇందులో అన్ని వసతులు కల్పించారు. కరోనా ఇతరత్రా కారణాలతో ప్రారంభించలేకపోయినం. త్వరలోనే మంత్రి కేటీఆర్ నేతృత్వంలో లబ్ధిదారులతో గృహ ప్రవేశం చేయించనున్నారు. ఇంత మంచి ఇండ్లు నిర్మించి పేదల బతుకుల్లో వెలుగులు నింపుతున్న
ఈ సర్కారుకు లబ్ధిదారుల తరుఫున కృతజ్ఞతలు.
– తన్నీరు గౌతంరావు, సర్పంచ్ (పోతుగల్)
మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు
మా గ్రామంలోని ఇండ్లు లేని 48 మంది నిరు పేద కుటుంబాలకు అశ్రయం కల్పించాడం సంతోషంగా ఉన్నది. ఇందులో అన్ని వసతులు కల్పించారు. సముదాయంలో పూల మొక్కలను పెంచడంతో ఆహ్లాదకర వాతావరణం నెలకొన్నది. ఎంపికైన లబ్ధిదారులకు శుభాకాంక్షలు. మంజూరు చేసిన మంత్రి కేటీఆర్కు ధన్యవాదాలు.
– అక్కరాజు శ్రీనివాస్, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు (పోతుగల్ )