మల్యాల, నవంబర్ 17 : కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ప్రధాన ఆలయంతోపాటు అనుబంధ ఆలయాల్లోని హుండీలు గురువారం లెక్కించగా 32 రోజులకు రూ.48.50 లక్షల ఆదాయం సమకూరినట్లు కరీంనగర్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆలయ ఇన్స్పెక్టర్ రవికిషన్, ఆలయ ఈవో టంకశాల వెంకటేశం తెలిపారు.
ఈసందర్భంగా మిశ్రమ బంగారం 16 గ్రాము లు, మిశ్రమ వెండి కిలో 900 గ్రాములు, విదేశీ కరెన్సీ 18 నోట్లు సమకూరినట్లు పేర్కొన్నారు. ఇక్కడ ఆలయ పాలకమండలి చైర్మన్ మారుతీస్వామి, ధర్మకర్తలు లింగాగౌడ్, జున్ను సురేందర్, పుల్కం నర్సయ్య, పర్యవేక్షకుడు సునీల్, ఇన్స్పెక్టర్లు జెమిని శ్రీనివాస్, సంప త్, శివశక్తిసేవాసమితి సభ్యులు,సిబ్బంది ఉన్నారు.