భానుడు మండుతున్నడు. వారం పది రోజుల నుంచి అంబటాళ్లకే అగ్గి కురిపిస్తున్నడు. గరిష్ఠంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలతో అదరగొడుతున్నడు. జిల్లా అంతటా నిప్పుల కొలిమిలా మారుతుండడంతో జనం అల్లాడుతున్నరు. ఉదయం 9గంటల నుంచే ఎండ మండుతుండడంతో ఇండ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నరు.
కోల్బెల్ట్ ఏరియాలో మరింత ఠారెత్తిస్తుండడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వడగాలులకు జనాలు అస్వస్థతకు గురవుతున్నారు. మరో మూడు రోజుల పాటు మరింత ముదిరే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతుండడంతో బెంబేలెత్తుతున్నారు. ఏప్రిల్లోనే ఇలా ఉంటే మేలో పరిస్థితిని తలచుకొని ఆందోళన చెందుతున్నరు.
– కోల్సిటీ, ఏప్రిల్ 27