భానుడు భగభగమంటున్నాడు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై నిప్పులు కక్కుతున్నాడు. ఈ తరుణంలో ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయిలో నమోదవుతున్నాయి. ఉదయం నుంచే సూర్యుడు ప్ర‘తాపం’ చూపుతుండడంతో ప్రజలు అల్లాడి పోతున్నారు.
భానుడు మండుతున్నడు. వారం పది రోజుల నుంచి అంబటాళ్లకే అగ్గి కురిపిస్తున్నడు. గరిష్ఠంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలతో అదరగొడుతున్నడు. జిల్లా అంతటా నిప్పుల కొలిమిలా మారుతుండడంతో జనం అల్లాడుతున్నరు.